Francoise Bettencourt Meyers: 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి తొలిసారిగా ఆమె..!
Francoise Bettencourt Meyers: ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
Francoise Bettencourt Meyers | ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్కు చెందిన సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ వైస్ ఛైర్పర్సన్ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ (Francoise Bettencourt Meyers) ప్రపంచంలో 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి మహిళగా నిలిచారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. గురువారం నాటికి ఆమె సంపద 100.2 బిలియన్ డాలర్లకు చేరింది. లోరియల్ ఎస్ఏ షేర్లు నిన్న భారీ ఎత్తున పుంజుకోవడమే అందుకు కారణం.
లోరియల్ కంపెనీ షేర్లు 1998 తర్వాత మళ్లీ 2023లోనే అత్యంత మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. బెటెన్కోర్ట్ మేయర్స్ (Francoise Bettencourt Meyers) కుటుంబం 35 శాతం షేర్లతో కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కంపెనీ విలువ ప్రస్తుతం 268 బిలియన్ డాలర్లు. 1909లో తాత యూజీన్ షూలర్ ప్రారంభించిన లోరియల్ కంపెనీలో బెటెన్కోర్ట్ మేయర్స్ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
మీ విమానం బోల్టులు సరిచూసుకోండి..కోరిన బోయింగ్..!
ప్రపంచంలోని అనేక మంది సంపన్నులు కోరుకునే విలాసాలను విడిచిపెట్టి ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ (Francoise Bettencourt Meyers) నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. లోరియల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆమె రెండు పుస్తకాలు కూడా రాశారు. బైబిల్పై సమగ్ర అధ్యయనం చేసి ఐదు సంపుటాల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. గ్రీకు దేవుళ్ల వంశానుక్రమంపై మరో పుస్తకాన్ని వెలువరించారు. అలాగే రోజుకు కొన్ని గంటలపాటు పియానో వాయిస్తుంటారు. 2017లో తల్లి లిలియన్ బెటెన్కోర్ట్ మరణం తర్వాత సంపద మొత్తం ఆమె చేతికి వచ్చింది.
కరోనా మహమ్మారి సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. లోరియల్ వేగంగా తిరిగి పుంజుకుంది. లాక్డౌన్ల ఎత్తివేత తర్వాత విలాసవంత ఉత్పత్తుల గిరాకీ భారీగా పెరిగింది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 35 శాతం రాబడి ఇవ్వడం విశేషం. ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రస్తుతం మేయర్స్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM