పసిడి డెలివరీకి 2 దేశీయ సంస్థలు
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) తన ప్లాట్ఫాంపై పసిడి డెలివరీ నిమిత్తం రెండు దేశీయ పసిడి రిఫైనర్లు ఎం డి ఓవర్సీస్, కుందన్ కేర్ ప్రోడక్ట్స్లను ఎంపిక చేసుకుంది.
ఎంపిక చేసుకున్న ఎంసీఎక్స్
తొలుత 100 గ్రాముల కడ్డీలతో ప్రారంభం
ముంబయి: మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) తన ప్లాట్ఫాంపై పసిడి డెలివరీ నిమిత్తం రెండు దేశీయ పసిడి రిఫైనర్లు ఎం డి ఓవర్సీస్, కుందన్ కేర్ ప్రోడక్ట్స్లను ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనుమతి ఉన్న రిఫైనర్లు మాత్రమే పసిడి, వెండి కడ్డీలను డెలివరీ చేస్తున్నాయని ఎంసీఎక్స్ ఒక ప్రకనటలో తెలిపింది. ఎంపిక చేసుకున్న ఈ రెండు దేశీయ రిఫైనర్లు, శుద్ధి చేసిన పసిడి కడ్డీల డెలివరీని తొలుత డెరివేటివ్ కాంట్రాక్టులోని 100 గ్రాముల పసిడి కడ్డీలతో ప్రారంభిస్తాయని పేర్కొంది. మరికొన్ని రిఫైనర్లపై ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియ జరుగుతోందని, ఇవి కూడా త్వరలో జత అవుతాయని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం