పాక్‌ కాల్పుల్లో జవాను వీరమరణం

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు...

Published : 22 Nov 2020 01:26 IST

శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఓ జవాను మృతిచెందగా మరో జవాను గాయాలపాలయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు నౌషీరా సెక్టార్‌లోని లామ్‌ ప్రాంతంలో పాక్‌ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హవల్దార్‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరో జవాను చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కాగా పాక్‌ దాడికి భారత్‌ దీటుగా స్పందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొద్ది సమయంపాటు పాక్‌ సైన్యానికి, భారత జవాన్లకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని