నేపాల్ దొంగలను పట్టుకున్నాం!
రాయదుర్గంలో చోరీకి పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్కు చెందిన ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ ...
రాయదుర్గం చోరీ కేసు వివరాలు వెల్లడించిన సజ్జనార్
హైదరాబాద్: రాయదుర్గంలో చోరీకి పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్కు చెందిన ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీసీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.5.20 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఆయన విలేకరుతో మాట్లాడుతూ... చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బోర్వెల్ వ్యాపారి మధుసూదన్రెడ్డి ఇంట్లో నేపాల్ ముఠా పని మనుషులుగా చేరి, వారితో నమ్మకంగా ఉంటూ చోరీకి పాల్పడిందన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడ్ని నేపాల్కు చెందిన నేత్రగా, మిగిలిన ఇద్దర్నీ ప్రకాశ్ సాహీ, సీతగా గుర్తించామన్నారు.
యజమానుల భోజనం, టీలో సీత నిద్రమాత్రలు వేసిందని, వారంతా గాఢ నిద్రలోకి జారుకున్నాక తమ ముఠా సభ్యులకు ఆమె సమాచారమిచ్చిందని సజ్జనార్ తెలిపారు. యజమానురాలు శైలజ కేవలం టీమాత్రమే తాగడంతో ఆమెకు మెలుకువ రావడంతో ఆమెను కట్టేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పనట్లు సజ్జనార్ వివరించారు.‘‘ ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేసివారితో మాట్లాడి వారి సహాయంతో చోరీకి పాల్పడతారు.
చోరీ చేశాక తలో దారిలో నేపాల్ చేరుకుంటారు. నార్సింగిలో వృద్ధ దంపతులను కట్టేసి చోరీకి పాల్పడిన కేసులోనూ నేత్ర ప్రధాన నిందితుడు. ఫిర్యాదు రాగానే 10 బృందాలను ఏర్పాటు చేశాం’’ అని సజ్జనార్ వివరించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులు సాయంతో వీరిని పట్టుకున్నామన్నారు. మిగతావారి కోసం వివిధ రాష్ట్రాల్లో గాలిస్తున్నామని చెప్పారు.
తెలియని వాళ్ళని పనిలో పెట్టుకోవద్దని, ఒకవేళ పెట్టుకున్నా వాళ్ల వివరాలను స్థానిక పోలీసులకు ఇవ్వాలని సజ్జనార్ సూచించారు. ఇళ్లలోని అన్ని ప్రాంతాల్లోకి వాళ్లను అనుమతించొద్దన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.