ఏపీలో స్కూల్‌ బస్సు ప్రమాదాలు.. పలువురు విద్యార్థులకు గాయాలు

ఏపీలోని పల్నాడు, కడప జిల్లాల్లో స్కూల్‌ బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Updated : 19 Feb 2024 19:17 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గండ్లూరు అడ్డరోడ్డు సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం సాయంత్రం సత్తెనపల్లి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 50 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు గండ్లూరు వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

కడప జిల్లాలోనూ..

కడప జిల్లాలోని వల్లూరు మండలం అంబరం వద్ద మరో స్కూల్‌ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని