మదనపల్లె ఘటన: తిరుపతి రుయాకు నిందితులు

సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల క్రితం కన్న కూతుళ్లను మూఢభక్తితో హత్య చేసిన కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తంనాయుడు 14 రోజుల రిమాండ్‌ నిమిత్తం మదనపల్లె సబ్‌ జైలులో ఉంటున్న..

Updated : 30 Jan 2021 06:15 IST

తిరుమతి: సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల క్రితం కన్న కూతుళ్లను మూఢభక్తితో హత్య చేసిన కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తంనాయుడు 14 రోజుల రిమాండ్‌ నిమిత్తం మదనపల్లె సబ్‌ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, వారి మానసికస్థితి సరిగా లేనందున.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని రెండు రోజుల క్రితం జైలు అధికారులకు వైద్యులు సూచించారు. కోర్టు అనుమతితో శుక్రవారం ఉదయం నిందితులను జైలు నుంచి చిత్తూరు ఏఆర్‌ సిబ్బంది భద్రత నడుమ తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఓపీ అనంతరం వారిద్దరినీ ఆస్పత్రిలోని సైకియాట్రీ వార్డుకు తరలించారు. నిందితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భారతి ఆరా తీశారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితులకు వైద్యం అందించాలా లేక మరో చోటికి రిఫర్‌ చేయాలా అనే అంశాన్ని చెప్పగలమని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి..

అందరితో కలిపి నన్నూ ఉంచండి

అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని