PPE KITS: పీపీఈ కిట్లను ఉతికి.. మళ్లీ విక్రయిస్తూ..!
శంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న వేళ ఓ వీడియో కలకలం రేపింది. వైద్య వ్యర్థాల నిర్వీర్యం చేసే ఓ సంస్థ ఉద్యోగులు పీపీఈ కిట్లను ఉతకడం వైరల్గా మారింది. వినియోగించిన పీపీఈ కిట్లు, గ్లౌజులను నిర్వీర్యం చేయాల్సింది పోయి.. వాటిని ఉతికి
దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
మధ్యప్రదేశ్: దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న వేళ ఓ వీడియో కలకలం రేపింది. వైద్య వ్యర్థాల నిర్వీర్యం చేసే ఓ సంస్థ ఉద్యోగులు పీపీఈ కిట్లను ఉతకడం వైరల్గా మారింది. వినియోగించిన పీపీఈ కిట్లు, గ్లౌజులను నిర్వీర్యం చేయాల్సింది పోయి.. వాటిని ఉతికి విక్రయిస్తున్నారు. ఓ చోట భారీ సంఖ్యలో వాడిపడేసి ఉన్న పీపీఈ కిట్లు, గ్లౌజులను కొందరు నీటిలో ఉతుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శుభ్రం చేసి ఆరబెట్టి, మడతబెట్టిన కొన్ని పీపీఈ కిట్లు కూడా అక్కడ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాకు చెందిన ఓ సంస్థ ఈ రకంగా పీపీఈ కిట్లను వేడి నీటిలో శుభ్రం చేసి వాటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ విషయంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సత్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజేశ్ షాహి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బృందం సంబంధిత బయో వేస్ట్ ప్లాంట్కు చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. 2006 నుంచే సదరు సంస్థ వైద్య వ్యర్థాలను సేకరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సదరు ప్లాంట్ వైద్య వ్యర్థాలను నిర్వీర్యం చేయడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సదరు ప్లాంట్ ఉద్యోగిని మీడియా ప్రశ్నించగా.. ‘పీపీఈ కిట్లను నిర్వీర్యం చేయకుండా వాటిని శుభ్రం చేయాలని మా అధికారులు చెప్పారు. వేడి నీరు వైరస్ను చంపేస్తుందని తెలిపారు. నిర్వీర్యం చేసేందుకు మా సంస్థకు ప్రతి రోజు దాదాపు వెయ్యి పీపీఈ కిట్లు వస్తాయి’ అని ఆ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం