నేరాన్ని అంగీకరించని నిందితులు!

ప్రత్యేక న్యాయస్థానంలో సమత కేసు విచారణ కొనసాగుతోంది. బందోబస్తు నడుమ శుక్రవారం కారాగారం నుంచి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానానికి నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మఖ్దూంలను తీసుకొచ్చారు. నిందితులను..

Updated : 04 Jan 2020 07:42 IST

సమత కేసు విచారణ ఆరో తేదీకి వాయిదా

ఆదిలాబాద్‌ నేరవిభాగం: ప్రత్యేక న్యాయస్థానంలో సమత కేసు విచారణ కొనసాగుతోంది. బందోబస్తు నడుమ శుక్రవారం కారాగారం నుంచి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానానికి నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మఖ్దూంలను తీసుకొచ్చారు. నిందితులను.. ఛార్జిషీట్‌ ఆధారంగా రూపొందించిన 52 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే, తమపై తప్పుడు ఆరోపణలతో నేరాభియోగాలు మోపారని, హత్యాచారానికి పాల్పడింది తాము కాదని నిందితులు న్యాయస్థానంలో చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని