48గంటలపాటు ఇంట్లోనే కరోనా మృతదేహం!
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణతో ఇప్పటికే ప్రజలు వణికిపోతున్నారు. మాస్కు, భౌతిక దూరం పాటిస్తున్నా వైరస్ ఏ రూపంలో సంక్రమిస్తుందోననే భయం ప్రజల్లో నెలకొంది. ఇక కరోనా సోకిన వారు మరణిస్తే వారి మృతదేహాన్ని ..
కుటుంబసభ్యులు వేడుకున్నా స్పందించని అధికారులు
ఇంట్లో మృతదేహంతో రెండురోజులు నరకయాతన
కోల్కతా: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణతో ఇప్పటికే ప్రజలు వణికిపోతున్నారు. మాస్కు, భౌతిక దూరం పాటిస్తున్నా వైరస్ ఏ రూపంలో సంక్రమిస్తుందోననే భయం ప్రజల్లో నెలకొంది. ఇక కరోనా సోకిన వారు మరణిస్తే వారి మృతదేహాన్ని ఇంటికి కూడా తీసుకువెళ్లేందుకు నిబంధనలు అనుమతించవు. అలాంటిది, అధికారుల నిర్లక్ష్యవైఖరితో ఏకంగా కరోనా సోకిన వ్యక్తి మృతదేహాన్ని రెండురోజులపాటు ఇంట్లోనే భద్రపరచాల్సిన విషాధ ఘటన కోల్కతాలోని ఓ కుటుంబానికి ఎదురయ్యింది. సాయం చేయాలని కుటుంబసభ్యులు వేడుకున్నప్పటికీ కోల్కతా అధికారులు స్పందించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.
కరోనా సోకి మరణించిన వారి విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినప్పటికీ అధికారులు మాత్రం కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెంట్రల్ కోల్కతాలో రాజా రామ్మోహన్రాయ్ కాలనీకి చెందిన ఓ 71ఏళ్ల వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరంతోపాటు కొవిడ్ లక్షణాలు ఉండడంతో కుటుంబసభ్యులు ఓ వైద్యుడి సలహాతో ప్రైవేటు ల్యాబ్లో పరీక్ష చేయించారు. అనంతరం వృద్ధుడిని ఇంటికి తీసుకురాగా ఆరోగ్యపరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం కన్నుమూశాడు. అయితే, కొవిడ్ పరీక్షా ఫలితం ఇంకా రాకపోవడంతో అతడికి మరణ ధృవీకరణపత్రాన్ని ఇచ్చేందుకు స్థానిక ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు.
ఇదే విషయాన్ని అతని కుటుంబసభ్యులు స్థానిక పోలీసులు, కౌన్సిలర్లకు తెలియజేసి వారి సాయం కోరారు. వారు ఎలాంటి సహాయం చేయకపోవడంతో ప్రభుత్వ వైద్యాధికారులతోపాటు మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేయాలని కుటుంబసభ్యులు వేడుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాకుండా మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచాలని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబసభ్యులు రాష్ట్ర కొవిడ్ హెల్ప్లైన్ సాయం కోరేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. ఇక అంత్యక్రియల కోసం నగరంలోని పలు శ్మశానవాటికలను సంప్రదించగా మరణ ధృవీకరణపత్రం లేదని ఖననం చేసేందుకు నిరాకరించారు. కనీసం మరణ ధృవీకరణపత్రాన్ని జారీచేయాలని మునిసిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వారినుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇలా వందల సార్లు అధికారులకు ఫోన్లు చేయడంతోపాటు వారిచుట్టూ తిరిగినా ఫలితం లేదని కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో చేసేదేంలేక బయట మార్కెట్లో ఓ ఫ్రీజర్ను కొనితెచ్చి ఇంటిలోనే రెండురోజుల పాటు మృతదేహాన్ని ఉంచారు.
ఇలా వ్యక్తి మరణించిన 48గంటల అనంతరం వైద్యపరీక్షల్లో ఆ వృద్ధుడికి పాజిటివ్ అని తేలిన విషయాన్ని అధికారులు కుటుంబసభ్యులకు తెలిపారు. ఈ విషయం మీడియాలో రావడంతో మేల్కొన్న అధికారులు బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. అయితే, కుటుంబసభ్యులు ఎంత వేడుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోల్కతా అధికారుల తీరుపై అపార్టుమెంటువాసులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.