Suicides: వివాహితుల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ
హైదరాబాద్ దేశవ్యాప్తంగా పెళ్లికాని వారికంటే పెళ్లయినవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రమాద మరణాల్లో 15వ స్థానంలో తెలంగాణ
వడదెబ్బ మరణాలు రాష్ట్రంలోనే అధికం
ఈనాడు - హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెళ్లికాని వారికంటే పెళ్లయినవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమవుతున్నాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) 2020 నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు 5 శాతం పెరిగి 8,058 నమోదైనట్లు వెల్లడించింది.
• మిగతా వారు పేదరికం, వావాహ సంబంధ విషయాలు, సుఖవ్యాధుల వంటి వాటివల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ప్రమాదాలతో..
• దేశవ్యాప్తంగా ప్రమాదాలతో 3,74,397 మరణాలు సంభవించాయి. 2019తో పోలిస్తే 12.1 శాతం తగ్గాయి. ఇందులో ప్రకృతి విపత్తుల కారణంగా 7,405 మంది (తెలంగాణలో 170), ఇతర ప్రమాదాల కారణంగా 3,66,992 (తెలంగాణలో 11,652) మంది మృతి చెందారు. తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. మొత్తం ప్రమాద మరణాల్లో అత్యధికంగా రహదారులపై జరిగినవి 39.1 శాతం ఉన్నాయి.
• దేశవ్యాప్తంగా 2019తో పోలిస్తే ట్రాఫిక్(రోడ్డు, రైలు) ప్రమాదాలు 2020లో తగ్గాయి. 2019లో 4,67,171 నమోదు కాగా.. 2020లో వీటి సంఖ్య 3,68,828. తెలంగాణలో ఈ సంఖ్య 19,505.
• దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ప్రమాద మరణాలు 3,66,992 కాగా.. తెలంగాణలో ఈ సంఖ్య 7,219.
• దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాద మరణాల్లో 43.6 శాతం ద్విచక్ర వాహనదారులవే. తర్వాతి స్థానాల్లో కారు (13.2%), ట్రక్కు/లారీల్లో (12.8%) ప్రయాణించినవారున్నారు. అత్యధికంగా 75,333 (56.6%) మంది అధిక వేగం కారణంగానే మృతి చెందారు.
• వడదెబ్బ కారణంగా దేశవ్యాప్తంగా 170 మరణాలు సంభవించగా.. తెలంగాణలో అత్యధికంగా 98 (57.6%) చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.