లారీ, కారు ఢీ.. ఒకరు మృతి

లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చౌటకూర్‌ మండలం సరాఫ్‌పల్లి శివారు నాందేడ్‌-అకోలా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పుల్కల్‌ ఎస్సై గణేష్‌ తెలిపిన ప్రకారం..

Updated : 04 Jul 2022 06:49 IST

మరొకరికి తీవ్రగాయాలు

నుజ్జయిన కారు నుంచి క్షతగాత్రుడిని బయటకు తీస్తున్న స్థానికులు

చౌటకూర్‌, జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చౌటకూర్‌ మండలం సరాఫ్‌పల్లి శివారు నాందేడ్‌-అకోలా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పుల్కల్‌ ఎస్సై గణేష్‌ తెలిపిన ప్రకారం.. గుజరాత్‌కు చెందిన విష్ణుబాయి పాటిల్‌ (60), నవనీర్‌ కారులో జోగిపేట నుంచి సంగారెడ్డి బయలు దేరారు. ఈ క్రమంలో సరాఫ్‌పల్లి శివారులోని లిక్కర్‌ కంపెనీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ, వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు  నుజ్జయి ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ విష్ణుబాయి పాటిల్‌ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాద సూచిక నామపలకాలను ఏర్పాటు చేయకుండా రోడ్డు నిర్మాణం కొనసాగిస్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని