మంచి ఉద్యోగం లేదని బలవన్మరణం

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు సరైన ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం..

Updated : 15 Aug 2022 04:26 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు సరైన ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన కంచర్ల గంగ మహేశ్వరరెడ్డి(29) బీటెక్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం మానేసి నెల క్రితం సికింద్రాబాద్‌ బోయిగూడకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సరైన ఉద్యోగం దొరకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వాషింగ్‌యార్డ్‌, ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌ బొల్లారం లైన్‌ ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్‌ డేవిడ్‌రాజ్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల ఆధారంగా మహేశ్వరరెడ్డిగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని