విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లో ఈడీ సోదాలు
క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు శుక్రవారం సోదాలు నిర్వహించాయి.
ఈనాడు, హైదరాబాద్: క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు శుక్రవారం సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్లో 3, బెంగళూరులో 4 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్లోని మాదాపూర్తో పాటు మరో రెండుచోట్ల ఆ సంస్థ కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్నారనే అభియోగాలతో ఆ సంస్థపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ సంస్థ మోసాలపై తెలంగాణ పోలీసులు దాదాపు 38 కేసులు నమోదుచేశారు. వీటి ఆధారంగానే ఈడీ 2020లో ఈసీఐఆర్ నమోదు చేసి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. 2013 నుంచే ముంబయి, బెంగళూరు, చెన్నై, దిల్లీ తదితర నగరాల్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు చట్టవ్యతిరేకంగా ఉన్నాయంటూ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్లో నమోదైన కేసుల్లో పలువురు సినీ, వ్యాపార ప్రముఖులకు నోటీసులు జారీచేశారు. మాజీ బిలియర్డ్స్ ఆటగాడు మైఖేల్ ఫెరీరా, బాలీవుడ్ నటులు షారూఖ్ఖాన్, అనిల్కపూర్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీషరాఫ్, పూజాహెగ్డే, క్రికెటర్ యువరాజ్సింగ్ తదితర 500 మందికి నోటీసులు పంపించారు. ఈ ప్రముఖులంతా క్యూనెట్ తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించినందుకు ఈ నోటీసులు పంపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయా కేసుల్లో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇటీవలే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం పాలవ్వడంతో మరోసారి గొలుసుకట్టు దందా బహిర్గతమైంది. ఈనేపథ్యంలోనే తాజా సోదాలకు ప్రాధాన్యం సంతరించుకొంది.
బుచ్చిబాబును సుదీర్ఘంగా విచారించిన ఈడీ
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. దిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న బుచ్చిబాబు రాత్రి 8.00 గంటల తర్వాత బయటకు వచ్చారు. దిల్లీ మద్యం కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై ఆయనను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 8న బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఇదే కేసులో అరెస్టు చేసిన విషయం విదితమే. ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఈ నెల ఆరో తేదీన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి పలుమార్లు ఈడీ అధికారులు బుచ్చిబాబును విచారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM