బాసలు మరచి.. నిలువునా నరికి..
మద్యం మత్తు విచక్షణను చంపేసింది.. భార్యపై అనుమానం రాక్షసుణ్ని చేసింది.. ఆమెపై కక్షతో పిల్లలను వేధించి జైలుపాలయ్యాడు. చివరకు జాలిపడి విడిపించిన భార్యను పాశవికంగా హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యపై అనుమానంతో రాక్షసుడైన భర్త
గతంలో పిల్లలకు క్రూరంగా చిత్రహింసలు
జైలు పాలైనా విడిపించిన ఆలిపై కత్తివేటు
చివరకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్మార్గుడు
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: మద్యం మత్తు విచక్షణను చంపేసింది.. భార్యపై అనుమానం రాక్షసుణ్ని చేసింది.. ఆమెపై కక్షతో పిల్లలను వేధించి జైలుపాలయ్యాడు. చివరకు జాలిపడి విడిపించిన భార్యను పాశవికంగా హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు(35)కు, నిర్మల(30)తో పెళ్లయింది. వీరికి ఒక కుమారుడు (12), ఇద్దరు కుమార్తెలు (11, 9 ఏళ్లు) ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు పనికి వెళ్లేవాడు కాదు. పైగా డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. పైగా ఆమెపై అనుమానం పెంచుకుని నిత్యం నరకం చూపేవాడు. ఆ బాధలు భరించలేక, ఇక్కడి సంపాదన సరిపోక కొన్నాళ్ల కిందట పిల్లలను భర్త వద్ద వదిలి నిర్మల మస్కట్ వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి డబ్బులు పంపుతూ ఉండేవారు. జల్సాలకు అలవాటు పడిన దావీదు మరింత సొమ్ము కోసం వేధించేవాడు.
పిల్లలను కొడుతూ వీడియో చిత్రీకరణ
ఇద్దరు కుమార్తెలను కొడుతూ, కత్తితో బెదిరిస్తూ.. ఆ దృశ్యాలను కుమారుడితో వీడియో తీయించి భార్యకు పంపేవాడు. ఇవి బయటకు రావడంతో పెంటపాడు పోలీసులు గత ఏడాది సెప్టెంబరులో ఇతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో బంధువులు పిల్లలను హాస్టల్లో చేర్పించారు. దీనికి బాధపడిన నిర్మల మూడు నెలల కిందట వీరంపాలెం వచ్చేశారు. అతనిలో మార్పు వస్తుందని పెద్దలు నచ్చజెప్పడంతో జైలులో ఉన్న దావీదును బెయిల్పై విడిపించారు. అతడు మారకపోగా మద్యం మత్తులో నిత్యం భార్యతో ఘర్షణ పడేవాడు. నెల రోజుల కిందట ఆమె భర్తను వదిలి చిన్నాయగూడెంలోని చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.
బతిమాలి.. ఒట్టేసి..: ఇంకెప్పుడూ గొడవ పడనని అతను ఒట్టేసి, బతిమిలాడి పది రోజుల కిందట ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా.. భర్త మారాడనుకుని నమ్మి ఇంటికి వచ్చిన ఆమెకు మళ్లీ మునుపటిలాగే నరకాన్నే చూపించాడు. శుక్రవారం తెల్లవారుజామున వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దావీదు ఆమెపై కత్తితో దాడి చేశాడు. మెడ, తల, ఇతర శరీర భాగాలపై ఇష్టానుసారం పొడిచాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. చేతులు సైతం నరికి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తర్వాత ఇంట్లో ఉన్న గడ్డి మందు తీసుకుని పొలాల్లోకి వెళ్లి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన