Medical Student: మర్మాంగం కోసుకొని.. వైద్య విద్యార్థి ఆత్మహత్య

సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీక్షిత్‌రెడ్డి(21) అనే యువకుడు ఆదివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated : 10 Jul 2023 07:50 IST

పేట్‌బషీరాబాద్‌ (జగద్గిరిగుట్ట), న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీక్షిత్‌రెడ్డి(21) అనే యువకుడు ఆదివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానసికస్థితి సరిగా లేకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివసిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఉన్నారు. దీక్షిత్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గతంలో నిద్రమాత్రలు మింగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చికిత్స చేయిస్తున్నారు. మందులు తింటున్నానని మనోవేదనకు గురయ్యేవాడు. కుటుంబ సభ్యులు బయటకెళ్లి ఆదివారం సాయంత్రం 5 గంటలకు  తిరిగి రాగా.. ఇంట్లో ఉన్న దీక్షిత్‌రెడ్డి ఎంతకీ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో ఉన్నాడు.  108కు ఫోన్‌ చేయగా.. సిబ్బంది వచ్చి చూసేసరికి మర్మాంగం కోసుకొని మృతి చెంది ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని