Mahadev Betting App Scam: బెట్టింగ్ యాప్ మాటున స్కామ్
దేశంలో బెట్టింగ్ యాప్ మాటున జరుగుతున్న స్కామ్ ఒకటి వెలుగు చూసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది.
బాలీవుడ్లో కలకలం
దిల్లీ: దేశంలో బెట్టింగ్ యాప్ మాటున జరుగుతున్న స్కామ్ ఒకటి వెలుగు చూసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్కు చెందిన పలువురి పేర్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరుకావడమే కారణం. దీంతో వారికి ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దుబాయ్ కేంద్రంగా దేశంలో సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో వారు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న కోల్కతా, భోపాల్, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్కు సంబంధించి కొన్ని ఆధారాలు సంపాదించింది. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్షోర్ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.
కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్ పెద్ద ఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లూ తెలిపింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోనీ, నేహా కక్కర్, అతీఫ్ అస్లాం, రహత్ ఫతేహ్ అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దద్లానీ తదితరులు హాజరయ్యారు. వీరి కోసం ఓ ప్రైవేటు జెట్ను ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్ నిర్వహించిన పార్టీకీ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్ము ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలకూ ఈడీ సమన్లు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.