గ్యాంగ్రేప్కి పాల్పడి.. వీడియోని వైరల్ చేసి..
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా..
ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా బాలికలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా సీతాపుర్లో ఓ 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డ దుండగులు ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అప్రమత్తమైన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని మిగతావారి కోసం గాలిస్తున్నారు. సూపరింటెండెంట్ ప్రకాశ్సింగ్ వివరాల ప్రకారం.. సెప్టెంబర్7న సుల్తాన్పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను అపహరించుకుపోయిన ఐదుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో కూడా తీశారు. విషయం బయటకు చెబితే ఆ వీడియోను వైరల్ చేస్తామంటూ బాలికను బెదిరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా సదరు వీడియోను ఓ నిందితుడు సామాజిక మాధ్యమంలో ఉంచగా అది కాస్తా వైరల్ అయ్యింది. దాన్ని చూసిన పోలీసులు అప్రమత్తమై ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. క్లిప్ను కట్టడిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం తరలించనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?