Visakhapatnam: లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

Updated : 29 May 2023 19:11 IST

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలేనికి చెందిన ఎస్‌.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్‌కుమార్‌ లాడ్జిలో కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనుమానంతో తలుపులు పగలగొట్టిన లాడ్జి సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్‌కుమార్‌ను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా.. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి శరీరాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అచ్యుతాపురం సీఐ మురళీరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని