Visakhapatnam: లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలేనికి చెందిన ఎస్.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్కుమార్ లాడ్జిలో కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనుమానంతో తలుపులు పగలగొట్టిన లాడ్జి సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్కుమార్ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా.. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి శరీరాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అచ్యుతాపురం సీఐ మురళీరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.