Nizamabad: ప్రైవేటు బస్సులో రూ.12.80 లక్షలు చోరీ

నిజామాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తోన్న వ్యక్తి నుంచి దుండగులు రూ.12.80లక్షలు అపహరించారు. 

Published : 14 Jan 2024 15:50 IST

నిజామాబాద్‌ నేర విభాగం: జిల్లా కేంద్రంలోని ఆరో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి నుంచి దుండగులు రూ.12.80లక్షలు అపహరించారు.  ముంబయి నుంచి జగిత్యాలకు వచ్చే ప్రైవేటు బస్సులో జగిత్యాలకు చెందిన హనుమంతు ప్రయాణిస్తున్నాడు. నిజామాబాద్‌ శివారులోని సారంగాపూర్‌లో వద్ద టీ తాగడానికి బస్సు ఆపారు. ఇదే అదునుగా దుండగులు బాధితుడి నగదు బ్యాగును చోరీ చేశారు. బస్సులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చేయి అడ్డుపెట్టి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బ్యాగ్‌లో రూ.12.80 లక్షలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మొగులయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని