నదిలోకి దూసుకెళ్లి జీపు: 10మంది మృతి

బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది.

Updated : 23 Apr 2021 15:19 IST

పట్నా: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్నా జిల్లా పీపాపుల్‌ వద్ద శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో జీపులో 15 మంది ఉన్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా్యి. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతివేగంతో వచ్చిన జీపు వంతెనపైకి రాగానే అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం సమయంలో ఇద్దరు జీపు పైభాగంలో కూడా కూర్చున్నట్లు వెల్లడించారు. జీపు నదిలో పడుతున్న క్రమంలో పైన ఉన్న ఇద్దరూ ముందే దూకేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని