AP News: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21) విజయవాడలో బీటెక్ చదవుతోంది.
గుణదల, న్యూస్టుడే: ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21) విజయవాడలో బీటెక్ చదవుతోంది. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్లోనే తరగతులకు హాజరవుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొవ్వాడ తరుణ్ తెడ్లంలో ఉంటున్న తన సోదరి ఇంటికి గత ఏడాది వచ్చాడు. అక్క కుటుంబానికి చెందిన ఈ- సేవ కేంద్రంలో పని చేసేవాడు. ప్రాజెక్టు పని మీద మున్ని తరచూ అక్కడకు వచ్చేది. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఈ నెలలో పరీక్షలు ఉన్నాయని మున్ని విజయవాడకు వచ్చింది. ఖాళీగా ఉండడం ఎందుకని, ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్గా విధుల్లోకి చేరింది. అదే సంస్థలో తన స్నేహితుడు తరుణ్ కూడా చేరాడు. దీంతో ఇద్దరూ ఒకే చోట ఉండాలని నిశ్చయించుకున్నారు. అన్నా, చెల్లెళ్లమని గుణదల ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ నెల 6న చేరారు.
మిస్డ్కాల్ వివాదం
ఈ నెల 23న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మున్ని ఫోన్కు ఆమె పాత స్నేహితుడు మిస్డ్కాల్ ఇచ్చాడు. ఆమె చరవాణిని తరుణ్ పరిశీలించి, అతనితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉందని, తాను మాట్లాడడం లేదని తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో నిన్ను పెళ్లిచేసుకోను అంటూ తరుణ్ బయటకు వచ్చేశాడు. దీంతో ఆమె గదిలోపలికి వెళ్లి తలుపులు బిగించుకుంది. ఆ సమయంలో ఇంటి యజమాని వచ్చి, లోపల తమ పలుగు ఉందని, ఓ సారి ఇవ్వాలని బయట కూర్చున్న తరుణ్ని అడిగాడు. అతను తలుపు కొట్టగా, మున్ని ఎంత సేపటికీ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరివేసుకుని ఫ్యాన్కు వేలాడుతోంది. వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి తరుణ్ మాచవరం పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన ఘటనను పోలీసులకు వివరించాడు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన మున్ని సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా తరుణ్పై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.
మాయమాటలతో వంచించాడు
కంప్యూటర్ కొనిస్తానని, మాయమాటలు చెప్పి ఇక్కడకు తమ అమ్మాయిని తరుణ్ తీసుకొచ్చాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. మరో రెండు రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి వస్తానని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తల్లికి ఫోన్లో చెప్పిందన్నారు. వారు ప్రేమించుకుంటున్న సంగతి తెలియదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తరుణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి, మీ చెల్లి ఉరివేసుకుని చనిపోయిందని చెప్పాడని మున్ని అన్నయ్య సునీల్ తెలిపారు. వెంటనే కొత్త ఆసుపత్రికి వచ్చి సిబ్బందిని అడిగితే చనిపోలేదని, కొన ఊపిరితో ఉందని చెప్పారన్నారు. మున్ని మెడ ఎముకలు విరిగిపోయాయని, కాలి మడమ పైభాగంలో బొబ్బలున్నాయని, తరుణ్ ఆమెను కొట్టి చంపాడని బంధువులు ఆరోపించారు. నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. -
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
అబిడ్స్లోని శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది. -
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
తాజాగా వైరలైన తమ చిన్నారికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల విమర్శలను తట్టుకోలేని ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. -
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. -
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ