crime news: కీచక కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సంపంగి మహేశ్‌పై జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు.

Updated : 13 Aug 2021 05:42 IST

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సంపంగి మహేశ్‌పై జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నట్టు కలెక్టర్‌ వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధరణ కావడంతో మహేశ్‌పై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మహేశ్‌, మరికొందరు ముఠాగా ఏర్పడి బాలికలపై లైంగిక దాడి చేసినట్టు వివిధ మాధ్యమాల్లో రావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. రాజాపూర్‌కు చెందిన ప్రైవేటు టీచర్‌తో కలిసి మహేశ్‌ ఈ ఆకృత్యాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ప్రస్తుతం కార్యదర్శి మహేశ్‌ను జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని