అధికారినని.. అందినకాడికి దండుకోవాలని..!
మున్సిపల్ పరిధిలో పన్నుల చెల్లింపు పాత్ర ఎంతో కీలకం. వాటిని సకాలంలో చెల్లిస్తేనే పనులు సక్రమంగా సాగుతాయి.
మున్సిపల్ కమిషనర్ పేరిట వ్యాపారులకు ఫోన్కాల్స్
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: మున్సిపల్ పరిధిలో పన్నుల చెల్లింపు పాత్ర ఎంతో కీలకం. వాటిని సకాలంలో చెల్లిస్తేనే పనులు సక్రమంగా సాగుతాయి. అభివృద్ధి జరుగుతుంది. అందుకే.. నీటి, ఆస్తి, వ్యాపార అనుమతి తదితర అంశాలకు సంబంధించిన పన్నులు లక్ష్యానికి అనుగుణంగా వసూలయ్యేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తుంటారు. ఈ అవకాశాన్ని కొందరు తమకు అనుకూలంగా మలచుకొని అక్రమమార్గంలో, సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఈ విషయం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. విషయతీవ్రతను గుర్తించిన అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు.
ఏం జరిగిందంటే..
పట్టణంలోని పాతబస్టాండ్లో చికెన్ సెంటర్ నిర్వహించే వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్కాల్ వచ్చింది. అందులోని సారాంశం పరిశీలిస్తే.. ‘హలో.. నేను, రాజు, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నా. పాతబస్టాండ్లో ఉన్న చికెన్ సెంటర్ మీదేనా? మీ దుకాణం ట్రేడ్ లైసెన్సు ఎందుకు రెన్యువల్ చేయలేదు. సమయంలో చెల్లించాలి కదా. మీ వాట్సప్ నంబరు నుంచి నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను స్కానర్ కోడ్ పంపిస్తాను. మీ లైసెన్స్ రెన్యువల్ డబ్బులు ఆ స్కానర్కు ఫోన్పే చేయండి. ఇకమీదట ఏటా సమయంలోపు చెల్లించండి. మళ్లీ నా దృష్టికి రావొద్దు..’ అని ఫోన్ పెట్టేశారు. దీంతో సదరు వ్యాపారి అయోమయానికి గురయ్యారు. డబ్బులు కట్టాలా వద్దా అనే మీమాంసలో పడిపోయారు. ఇది కేవలం ఒక్కనికే కాదు, పలువురికి ఇదేరీతిలో ఫోన్కాల్స్ వచ్చాయి. అందరిలోనూ సందిగ్ధమే. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఈసారి ఫోన్చేసి మరీ డబ్బులు కట్టాలని సూచిస్తున్నారు. ఎందుకిలా? వార్షిక లక్ష్యాల సాధనకు ఇలా చేస్తున్నారేమోనని భావించారు. కట్టేద్దాంలే అనుకున్నారు. అయితే.. డబ్బులు ఎవరైనా స్కానర్ కోడ్ ఆధారంగా చెల్లించారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
వ్యాపారుల్లో ఆందోళన..
సాధారణంగా మున్సిపల్ సిబ్బంది వచ్చి పెండింగ్ పన్నులు వసూలు చేయడం చూస్తూనే ఉంటాం. పెద్దమొత్తంలో ఉంటే నోటీసులు జారీచేయడమూ తెలిసిందే. కానీ, ఏకంగా ఓ మున్సిపల్ కమిషనర్ తీరిక చేసుకొని ప్రతీ వ్యాపారికి ఫోన్చేసి పన్నులు చెల్లించాలని చెప్పడం వాస్తవానికి సాధ్యమయ్యే పనికాదు. ఇతర పని ఒత్తిళ్లతో తీరికలేకుండా ఉండే అధికారి ఇలా ట్రేడ్ లైసెన్సుల కోసం ప్రతీ నంబరుకు కాల్చేయడం కుదరదు. ఓ అధికారే నేరుగా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో డబ్బులు చెల్లిస్తారని, వారు చెప్పిన నంబరుకు పంపిస్తారన్న ఆశతో ఈ ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ పేరిట వచ్చిన కాల్స్ వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారడమే వారిని ఆందోళనకూ గురిచేశాయి.
ఆన్లైన్లో తీసుకొని..!
అంతర్జాల వినియోగంపై అవగాహన ఉన్నవారో, మున్సిపల్ సిబ్బంది సాయంతోనో ఈ తతంగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ వెబ్సైట్లో మనకు కావాల్సిన మున్సిపాల్టీని ఎంపికచేసుకొని అక్కడ అందుబాటులో ఉండే పౌరసేవలు, పన్నుల చెల్లింపు ఐచ్ఛికాలను ఆధారంగా చేసుకొని ఇలా వసూళ్లకు యత్నించారు. ఆన్లైన్లో నమోదైన వివరాలు, అందులోని చరవాణి నంబరు ఆధారంగా వారికి కాల్చేసి డబ్బులు చెల్లించాలని నమ్మబలికారు. ఇందుకోసం ట్రూకాలర్ సాయంతో వారి నంబరును మున్సిపల్ కమిషనర్ అని కనిపించేలా జాగ్రత్తపడినట్లు అవగతమవుతోంది. దుకాణం, పెండింగ్ వివరాలను తెలియజేస్తూ డబ్బులు అడగడం, జరిమానా తగ్గించేందుకు వారు సూచించిన నంబరుకు ఫోన్పే చేయాలని అడగడం.. ఇదంతా చూస్తుంటే ఎంతో పకడ్బందీగా, కట్టుదిట్టంగా వ్యవహరించారనే విషయం సుస్పష్టమవుతోంది.
పోలీసులకు ఫిర్యాదుచేశాం: సి.వి.ఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్
మున్సిపల్ కమిషనర్ పేరిట నకిలీ వ్యక్తులు కాల్చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరో తప్పుడు నంబర్ల సాయంతో ఈ పనిచేశారు. ప్రజలెవరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. ఎలాంటి పన్నులు చెల్లించాలన్నా నేరుగా ఆన్లైన్లో లేదా మున్సిపల్ కార్యాలయంలో, గుర్తింపు ఉన్న మున్సిపల్ సిబ్బంది వద్ద మాత్రమే చెల్లించాలి. తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఫేక్ కాల్స్ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదుచేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!