అరకొర పరిహారం.. అన్నదాతల ఆక్రోశం
తమ పొలాల నుంచి జాతీయ రహదారి వెళ్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది భూములకు మంచి విలువ ఉంటుందని ఆశ పడిన అన్నదాతలకు నిరాశే మిగులుతోంది.
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి భూములిచ్చేది లేదంటున్న వైనం
జైపూర్ మండలం నర్వ శివారులో ప్రతిపాదిత మంచిర్యాల-వరంగల్ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రదేశం
జైపూర్, న్యూస్టుడే: తమ పొలాల నుంచి జాతీయ రహదారి వెళ్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది భూములకు మంచి విలువ ఉంటుందని ఆశ పడిన అన్నదాతలకు నిరాశే మిగులుతోంది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతున్న భూములకు ప్రభుత్వం నామమాత్రంగా గ్రామాన్ని బట్టి రూ.4 నుంచి రూ.8 లక్షల పరిహారం ఇస్తామంటూ నోటీసులు పంపిస్తున్నారు. దీంతో మంచిర్యాల-వరంగల్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్వాసిత రైతులు లబోదిబోమంటున్నారు.
నాగ్పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మంచిర్యాల-వరంగల్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. అందులో జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం శివారులోని నర్వా నుంచి పౌనూర్ గ్రామంలోని గోపాల్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. 14 గ్రామాల మీదుగా 23.097 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. పచ్చని పొలాలు, గ్రామాలను ఆనుకుని నిర్మాణం సాగే ఈ జాతీయ రహదారిలో సుమారు 110 హెక్టార్ల మేర భూములు రోడ్డు నిర్మాణంలో కనుమరుగు కానున్నాయి.
అప్పట్లో రూ.8 లక్షలు
గోదావరి నది మీద సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం చేపట్టిన 2015-16 సంవత్సరంలో దాని సమీప గ్రామాల్లో ఎకరానికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రాజెక్టు కోసం భూములు తీసుకుని సుమారు 7-8 ఏళ్లు అవుతుంటే అప్పటికంటే సగమే ఇప్పుడు పరిహారం ఇవ్వడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తేనే భూములిచ్చి సహకరిస్తామని అప్పట్లో శెట్పల్లి గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత రైతులు తేల్చి చెప్పారు. అయితే గ్రామాన్ని బట్టి పరిహారం రూ.4-8 లక్షల పరిహారం కేటాయిస్తూ పలువురు రైతులకు నోటీసులు అందాయి. దీన్ని నిరసిస్తూ ఇటీవల స్థానిక తహసీల్దార్కు సైతం పరిహారం పెంచాలని వారు వినతిపత్రం అందజేశారు.
ఈ పరిహారంతో మరోచోట దొరుకుతుందా..
తుమ్మనపెల్లి నర్సింగారావు, కుందారం
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో నాకు సంబంధించి 2 ఎకరాల 13 గుంటల భూమిని నష్టపోతున్నా. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మా గ్రామంలో ఎకరం రూ.40-80 లక్షలు పలుకుతుంది. వీళ్లేమో ఎకరానికి రూ.4.30 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని నోటీసులు పంపిస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సమయంలో ఎకరానికి రూ.8 లక్షలపైచిలుకు పరిహారం ఇచ్చారు. వీరిచ్చే నామమాత్రపు పరిహారంతో మరో చోట భూమి దొరుకుతుందా.
మార్కెట్ ధర ఇస్తేనే ..
బోయిని రాజయ్య, నర్సింగాపూర్
సుందిళ్ల ప్రాజెక్టు ఏర్పాటుతో మా ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మా గ్రామంలో భూముల ధరలు ఎకరానికి రూ.50 లక్షలపైచిలుకు పలుకుతుంది. అలాంటి భూములకు రూ.4 లక్షల పరిహారం ఇస్తామని మా పక్క గ్రామాల రైతులకు నోటీసులు ఇచ్చారు. రోడ్డు నిర్మాణంలో 30 గుంటల నా భూమి పోతుంది. రెండేళ్ల కిందటే గుంటకు రూ.3.50 లక్షల ఇస్తామంటే ఇవ్వలేదు. మార్కెట్ రేటు ఇస్తేనే భూమి ఇస్తాం. లేకుంటే ఇచ్చేది లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు: నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్