మళ్లీ.. ఏనుగు గండం!
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది.
జిల్లాకు ఎప్పుడైనా వచ్చే అవకాశం..
పెంచికల్పేట్ మండల అడవుల్లో ఏనుగు సంచారం
ఈనాడు, ఆసిఫాబాద్: గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. తదనంతరం మహారాష్ట్రకు వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల, కుమురం భీం జిల్లా ప్రాణహిత నదీ తీరం వెంబడి గ్రామాల వైపు ఏనుగు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఏనుగు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా, అదే సమయంలో దానికి ఎలాంటి హాని కలగకుండా.. ఉమ్మడి జిల్లా అటవీశాఖాధికారులు, పాలనాధికారులు, ఎస్పీలు మంగళవారం మంచిర్యాలలో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 2, 3 తేదీల్లో పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన పోషన్న, చింతలమానేపల్లి మండలానికి శంకర్ అనే రైతులను ఏనుగు తొక్కి హతమార్చింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ దారుణంతో మేల్కొన్న అటవీ అధికారులు.. దాదాపు వందమందిని నియమించి ఏనుగు కదలికలను తెలుసుకున్నారు. రహదారులపై పలుమార్లు ఏనుగు కనిపించినా ఎవరిపై దాడి చేయలేదు. 5వ తేదీ మధ్యాహ్నం మొర్లిగూడ గ్రామ సమీపంలో రహదారిపై వెళ్తున్న ఆటో సమీపంలో రాగా భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. మరుసటి రోజు సాయంత్రం ఏనుగు ప్రాణహిత సరిహద్దు దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిందని అటవీ అధికారులు నిర్ధారించారు.
ఒంటరిగానే..
ఒడిశా రాష్ట్రం నుంచి తెచ్చి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నాలుగు సంవత్సరాల కిందట 50-60 ఏనుగులను వదిలారు. ఈ గుంపు నుంచి తప్పిపోయిన ఏనుగే కుమురం భీం జిల్లా వచ్చింది. భారీ ఆకారంతో యుక్తవయసులో ఉన్న ఈ ఏనుగు ఉన్న కొన్ని గంటల పాటు ప్రజలను భయకంపితులను చేసింది. ఇది ప్రస్తుతం మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఒంటరిగానే సంచరిస్తోందని, అక్కడ మాత్రం పదిహేను రోజులుగా ఎవరిపై దాడి చేయలేదని అధికారులు చెబుతున్నారు.
50-60 కిలోమీటర్ల దూరంలో..
ప్రాణహిత నదిని ఆనుకుని మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ అభయారణ్యాలు ఒకవైపు ఉండగా, మరోవైపు తెలంగాణకు చెందిన కుమురం భీం, మంచిర్యాల జిల్లాల గ్రామాలు ఉంటాయి. ప్రస్తుతం ఏనుగు నదికి కేవలం 50-60 కిలోమీటర్ల మేర సంచరిస్తోందని, ఏ క్షణమైనా మళ్లీ తెలంగాణ వైపు రావొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా లేదా గుంపుగా వచ్చినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.
పరిహారం కోసం ఎదురుచూపులు..
18 రోజుల కిందట గజరాజు దాడిలో గంటల వ్యవధిలో ఇద్దరు రైతులు చనిపోయారు. కొండపల్లికి చెందిన పోశన్న(56), బూరేపల్లికి చెందిన శంకర్(50) కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే రైతులు వీరు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతోపాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర అధికారులు ప్రకటించారు. నేటికీ పరిహారం రాకపోవడంతో వీరంతా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పరిహారం వెంటనే మంజూరు చేయడంతోపాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.
నిపుణులను రప్పిస్తాం
ఏనుగు కదలికలు, ప్రవర్తన, తీసుకునే జాగ్రత్తల గురించి నిపుణులను రప్పిస్తాం. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఏనుగు ఎప్పుడైనా రావొచ్చు. అందుకు అనుగుణంగా మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాని కదలికలను తెలుసుకుంటున్నాం. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు వచ్చినా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలతో పాటు, అధికారులను సూచనలు చేస్తాం.
శాంతారాం, సీసీఎఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భరోసా నింపేందుకు భారాస అధినేత రాక
[ 04-05-2024]
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గత ఏడాది నవంబరు 24న మంచిర్యాల జిల్లా నస్పూర్లో నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాలలో రోడ్షో నిర్వహించనున్నారు. -
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే
[ 04-05-2024]
ఉమ్మడిజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగువారాలపాటు తీర్పును సస్పెన్షన్లో పెట్టింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ఇప్పుడు హైకోర్టుతీర్పు అంతే ప్రాధాన్యతాంశంగా మారింది. -
గోదాములకు సీల్.. వ్యాపారుల గోల్మాల్
[ 04-05-2024]
రైస్ మిల్లు యజమాని లీజుకు తీసుకున్న గోదాములను బ్యాంకు అధికారులు సీజ్ చేయడంతో అందులోని ధాన్యం నిల్వల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గోదాములను అద్దెకిచ్చిన యజమాని బ్యాంకు అప్పు చెల్లించడం లేదని ఎస్బీఐ అధికారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ముందే ఓటేశారు!
[ 04-05-2024]
పోలింగ్ తేదీకి ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్ ఓటును, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. -
ఇంటర్లో అందలం.. పదిలో అధమం
[ 04-05-2024]
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది. -
జిల్లా జోలికొస్తే భీం స్ఫూర్తిగా పోరాడుతాం
[ 04-05-2024]
అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
అక్రమ దందా.. ఆ ఇద్దరి అండ
[ 04-05-2024]
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పీడీఎస్ బియ్యం అక్రమ దందా మూడు బస్తాలు, ఆరు వాహనాలుగా విరాజిల్లుతూ వారి జేబులు నింపుతోంది. నేతల అండదండలతో అది శ్రుతిమించుతోంది. -
నిప్పుల కొలిమి
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటివారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. -
ఫోన్ చేయండి.. కథ వినండి
[ 04-05-2024]
వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉపాధిహామీ పథకం రద్దుకు భాజపా కుట్ర: మంత్రి
[ 04-05-2024]
కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. -
ఆ రెండు గ్రామాల వారు ఓటేసేది ఇక్కడే
[ 04-05-2024]
-
‘నిర్మల్ చరిత్ర’ పుస్తక రచయిత మృతి
[ 04-05-2024]
చారిత్రక ప్రాశస్త్యమున్న నిర్మల్ విశేషాలను ‘నిర్మల్ చరిత్ర’ పేరిట పుస్తకరూపంలో తీసుకొచ్చిన రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకం రాములు (76) గురువారం రాత్రి మృతిచెందారు. -
హామీలను విస్మరించి భాజపా పాలన
[ 04-05-2024]
ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం విస్మరించి పదేళ్లు పాలన సాగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) జిల్లా సమన్వయకర్తలు ఆకునూరి మురళి, నైనాల గోవర్ధన్ అన్నారు. -
విద్యుత్తు.. కారాదు విపత్తు
[ 04-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు. -
గోస తీర్చాలి.. బాసటగా నిలవాలి
[ 04-05-2024]
పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి. -
నాయకా.. ఆరోగ్యమూ ముఖ్యమే
[ 04-05-2024]
మండుటెండల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
సైబర్ కేసులో మరో ముగ్గురు..!
[ 04-05-2024]
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చిన కేసులో ఇదివరకే పట్టణానికి చెందిన షిండే ప్రణయ్ను సైబర్ క్రైం బ్యూరో (సీసీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు..
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని