మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది.
కరుగుతున్న గుట్టలు
దిలావర్పూర్ మండలం కాల్వ తండా సమీపంలోని తవ్విన గుట్ట ప్రాంతం
నిర్మల్, న్యూస్టుడే: జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. అనుమతులు లేకుండా అక్రమంగా జరిపిన తవ్వకాలతో పర్యావరణానికి హాని కలగడంతోపాటు ప్రభుత్వం రూ. లక్షల్లో ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. అక్రమ మార్గంలో ఇష్టమొచ్చిన చోట తవ్వకాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, స్థలాలు, వాగులు, చెరువులు, కుంటలు ఇలా దేన్ని వదలట్లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం మెక్కేస్తూ.. వెంచర్లలో నింపేస్తున్నా సంబంధితశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఎలా తరలిపోతుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు..
దిలావర్పూర్ మండలం కాల్వ తండా సమీపంలోని గుట్ట ప్రాంతం నుంచి ఆరు నెలలుగా మొరం తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల మొరం తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్లో సుమారు 2.85 క్యూబిక్ మీటర్ల మొరం తీసుకెళ్లొచ్చు. ఒక్కో క్యూబిక్ మీటరు మట్టికి రాయల్టీ కింద ప్రభుత్వానికి రూ.30 చెల్లించాలి. రోజుకు సగటున వంద ట్రాక్టర్లలో 285 క్యూబిక్ మీటర్ల మట్టి తరలిపోతుంది. ఈ లెక్కన రోజుకు రూ.8,550 ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకే చోట నుంచి ప్రభుత్వం ఇంత ఆదాయం కోల్పోతే జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అనుమతులేవీ..?
భూమి చదునుకు మొరం తరలించాలంటే గనులశాఖ నుంచి అనుమతులు పొందాలి. పట్టాభూముల్లో మొరం తరలించాలంటే హెక్టారుకు రూ.40 వేల చొప్పున గనులశాఖ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. క్యూబిక్ మీటరుకు రూ.30 చెల్లించాలి. వీటితోపాటు 2 శాతం ఆదాయం పన్ను, ఒక శాతం కార్మిక పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ నిర్మల్ శివారు ప్రాంతాల్లో, పల్లెల్లో మొరం తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా.. సంబంధితశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలు అసలే చేయరాదు. కానీ నిర్మల్ చుట్టూ ప్రాంతాల్లో యథేచ్ఛగా చేస్తున్నారు. గుట్టలను కరిగించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. నిర్మల్లోని ఆదర్శనగర్, విశ్వనాథ్పేట్, గాజుల్పేట్, సిద్ధాపూర్, శాంతినగర్, వెంకటాపూర్లతో పాటు మండలంలోని కడ్తాల్, శాకెర, వెంగ్వాపేట్, కొండాపూర్, వెంకటాపూర్, అక్కాపూర్, తదితర గ్రామాల్లో వెలిసిన లేఅవుట్లలో అక్రమంగా మొరం తరలించి చదును చేశారు. అనుమతి లేని ఈ లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిర్మల్ సమీపంలో లేఅవుట్లో పోసిన మొరం కుప్పలు
ఎక్కడెక్కడి నుంచి తరలిపోతుందంటే..
- ఒక్కో వెంచర్లో వందలాది టిప్పర్ ట్రిప్పుల మొరం వేస్తున్నారు. లేఅవుట్లు నల్లరేగడి భూముల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు స్తిరాస్థి వ్యాపారులు రోడ్ల నిర్మాణం, స్థలాల ఎత్తు పెంచేందుకు మొరంతో నింపుతున్నారు.
- ప్రభుత్వ సెలవు, ఆదివారాల్లో అధికారులు ఉండరని భావించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో మొరం తీసుకెళ్తున్నారు.
- జిల్లా కేంద్రం సమీపంలోని వైఎస్సార్నగర్, విశ్వనాథ్పేట్, బంగల్పేట్ మహాలక్ష్మి ప్రాంతాల్లోని గుట్టలను కరగగొట్టి నిత్యం వందలాది టిప్పర్లలో అక్రమంగా మొరం తరలిస్తున్నారు.
- సారంగాపూర్ మండలం చించోలి(బి), గోపాల్పేట్ శివారు నుంచి నిర్మల్ పట్టణానికి మట్టి తరలిస్తున్నారు. అక్కడక్కడ అడపాదడపా పోలీసులు అక్రమ తరలింపును అడ్డుకొని సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నారు.
- దిలావర్పూర్ మండలం కాల్వ, కాల్వ తండా సమీపంలో ఉన్న గుట్టను తొలిచేస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో మొరం తరలిస్తున్నారు.
- లక్ష్మణచాంద మండలం వడ్యాల్, సోన్ మండలం బొప్పారం గ్రామాల సమీపంలో గుట్టను తవ్వేస్తున్నారు.
- భైంసా పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న గుట్ట నుంచి మొరం తీసుకెళ్తున్నారు.
- ముథోల్ మండలం మచ్కల్, భైంసా మండలం ఇలేగాం ప్రాంతాల్లోని గుట్టల నుంచి మట్టిని తీస్తే మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
- తానూరు మండలం భోసి, బేల్తరోడ శివారులోని బాలాజీగుట్ట, బోంద్రట్, తదితర ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం తరలింపు జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే
[ 04-05-2024]
ఉమ్మడిజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగువారాలపాటు తీర్పును సస్పెన్షన్లో పెట్టింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ఇప్పుడు హైకోర్టుతీర్పు అంతే ప్రాధాన్యతాంశంగా మారింది. -
భరోసా నింపేందుకు భారాస అధినేత రాక
[ 04-05-2024]
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గత ఏడాది నవంబరు 24న మంచిర్యాల జిల్లా నస్పూర్లో నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాలలో రోడ్షో నిర్వహించనున్నారు. -
గోదాములకు సీల్.. వ్యాపారుల గోల్మాల్
[ 04-05-2024]
రైస్ మిల్లు యజమాని లీజుకు తీసుకున్న గోదాములను బ్యాంకు అధికారులు సీజ్ చేయడంతో అందులోని ధాన్యం నిల్వల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గోదాములను అద్దెకిచ్చిన యజమాని బ్యాంకు అప్పు చెల్లించడం లేదని ఎస్బీఐ అధికారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ముందే ఓటేశారు!
[ 04-05-2024]
పోలింగ్ తేదీకి ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్ ఓటును, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. -
ఇంటర్లో అందలం.. పదిలో అధమం
[ 04-05-2024]
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది. -
జిల్లా జోలికొస్తే భీం స్ఫూర్తిగా పోరాడుతాం
[ 04-05-2024]
అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
అక్రమ దందా.. ఆ ఇద్దరి అండ
[ 04-05-2024]
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పీడీఎస్ బియ్యం అక్రమ దందా మూడు బస్తాలు, ఆరు వాహనాలుగా విరాజిల్లుతూ వారి జేబులు నింపుతోంది. నేతల అండదండలతో అది శ్రుతిమించుతోంది. -
నిప్పుల కొలిమి
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటివారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. -
ఫోన్ చేయండి.. కథ వినండి
[ 04-05-2024]
వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉపాధిహామీ పథకం రద్దుకు భాజపా కుట్ర: మంత్రి
[ 04-05-2024]
కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. -
ఆ రెండు గ్రామాల వారు ఓటేసేది ఇక్కడే
[ 04-05-2024]
-
‘నిర్మల్ చరిత్ర’ పుస్తక రచయిత మృతి
[ 04-05-2024]
చారిత్రక ప్రాశస్త్యమున్న నిర్మల్ విశేషాలను ‘నిర్మల్ చరిత్ర’ పేరిట పుస్తకరూపంలో తీసుకొచ్చిన రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకం రాములు (76) గురువారం రాత్రి మృతిచెందారు. -
హామీలను విస్మరించి భాజపా పాలన
[ 04-05-2024]
ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం విస్మరించి పదేళ్లు పాలన సాగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) జిల్లా సమన్వయకర్తలు ఆకునూరి మురళి, నైనాల గోవర్ధన్ అన్నారు. -
విద్యుత్తు.. కారాదు విపత్తు
[ 04-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు. -
గోస తీర్చాలి.. బాసటగా నిలవాలి
[ 04-05-2024]
పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి. -
నాయకా.. ఆరోగ్యమూ ముఖ్యమే
[ 04-05-2024]
మండుటెండల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
సైబర్ కేసులో మరో ముగ్గురు..!
[ 04-05-2024]
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చిన కేసులో ఇదివరకే పట్టణానికి చెందిన షిండే ప్రణయ్ను సైబర్ క్రైం బ్యూరో (సీసీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు