చూద్దాం.. చేద్దాం..!
పాడేరు ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం శనివారం సాదాసీదాగా జరిగింది. కొత్త జిల్లాలో నిర్వహించిన తొలి సమావేశం కావడంతో కీలక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అమర్నాథ్, ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర,
అధికారుల తీరిది.. అమాత్యుల జాడేది!
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంపై అసంతృప్తి
వేదికపై కలెక్టర్ సుమిత్కుమార్, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, పీవో
పాడేరు/పట్టణం, న్యూస్టుడే: పాడేరు ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం శనివారం సాదాసీదాగా జరిగింది. కొత్త జిల్లాలో నిర్వహించిన తొలి సమావేశం కావడంతో కీలక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అమర్నాథ్, ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు ఈ సమావేశానికి తప్పకుండా వస్తారని ప్రచారం సాగింది. చివరికి వారంతా వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అధ్యక్షతన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ పర్యవేక్షణలో సమావేశం నిర్వహించారు. సభలో ప్రతిపక్ష సభ్యులు కూడా లేకపోవడంతో మొక్కుబడిగా సాగింది. గతంలో చేసిన తీర్మానాలపైనా చర్చించారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణలతో పాటు జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, జీసీసీ ఛైర్పర్సన్ స్వాతిరాణి పలు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నచిన్న సమస్యలకు సైతం అధికారులు, ఎమ్మెల్యేల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సభ్యులు కొంత అసహనానికి గురయ్యారు. ప్రతి అంశానికి చూద్దాం..చేద్దాం.. ప్రతిపాదనలు పంపామనే సమాధానాలే ఉన్నతాధికారుల నుంచి రావడంతో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
* ఎంపీ గొట్టేటి మాధవి మాట్లాడుతూ కొయ్యూరు మండలం వెలగలపాలెం, కొత్తపాలెం తాగునీటి పథకాలకు మరమ్మతులు చేయాలన్నారు. ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు.
* ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు అందించడంపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొయ్యూరు మండలం మఠంభీమవరం పరిధిలోని పలకజీడిలో గ్రామంలో మినీ పీహెచ్సీ ఏర్పాటు చేయాలని కోరారు. కాఫీ రైతులకు గత ఏడాదికి సంబంధించిన బకాయిలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
* ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు లేరని, వీరి భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. డుంబ్రిగుడ మండలం నిర్మాణంలో ఉన్న వంతెనలు పూర్తి చేయాలన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లే ముందు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్నారు.
* జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ కు.ని. శస్త్రచికిత్సలకు గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళలను విశాఖ తరలించడంపై సమాధానం చెప్పాలని పట్టుపట్టారు.
* ట్రైకార్ ఛైర్మన్ సతక బుల్లిబాబు మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో నియమించాలన్నారు.
* జడ్పీటీసీ సభ్యులు వారం నూకరాజు, బొంజుబాబు, గాయత్రిదేవి, మత్స్యలింగం, ఎంపీపీలు నాగరత్నం, బాబూరావు ఆయా మండలాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు
ప్రతి ఇంటికి కుళాయి
* జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పరిధిలో రూ.230 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ సహకరించాలన్నారు.
* ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ మాట్లాడుతూ 72 సౌర విద్యుత్తు పథకాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత ఐటీడీఏ బైలాలో అల్లూరి సీతారామరాజుగా మార్పు చేస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సబ్ కలెక్టర్ అభిషేక్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్