వర్షాలతో మునిగిన రైతన్న
అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది.
ఆరబోసిన పసుపు
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. దీనికితోడు పసుపు సాగు చేసిన పొలాల్లోకి నీరు చేరి, మొక్కలొచ్చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు పసుపు ఉడికించి కల్లాల్లో ఆరబోసి ఉంచారు. ఇదంతా తడిసిపోయింది. మాకవరం, కరిముఖిపుట్టు, పెదగుడ, కిలగాడ, జర్రెల, జర్జుల, బంగారుమెట్ట ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలిచింది. అసలే ఈ ఏడాది మార్కెట్లో పసుపు ధర పతనమైంది. గతేడాది కేజీ రూ. 90 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది గరిష్ఠంగా రూ. 58కి మించి చెల్లించడం లేదు. ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పంట కాపాడుకునేందుకు పాట్లు
ఎటపాక, న్యూస్టుడే: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే వర్షం కురవడం, ఆగిపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. సోమవారం ఉదయం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండటంతో గత రెండు రోజులుగా టార్పాలిన్ కింద భద్రపరిచిన మిరప కాయలను ఆరబోసుకున్నారు. ఇంతలోనే మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో వాటిని మరోసారి కుప్పలు చేసుకుని టార్పాలిన్ కప్పేలోపు మిరప కాయలు తడిశాయి. గుండాలకాలనీ, కన్నాయిగూడెం, ఎటపాక, రాజుపేట, మేడువాయి, పిచ్చుకలపాడు, గన్నవరం, మురుమూరు, నందిగామ, సీతాపురం, తోటపల్లి, కృష్ణవరం గ్రామాల్లో కల్లాల్లోని మిరపకాయలు వర్షానికి తడిశాయి.
దేవీపట్నం, న్యూస్టుడే: వర్షాలు తగ్గుముఖం పట్టకపోడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పొత్తులు తడిచిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూడిపల్లి, ఎ.వీరవరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులకు కొన్ని చోట్ల మొక్కజొన్న చేలు నేలవాలాయని రైతులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. -
జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కృషి
[ 10-05-2024]
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్. -
అప్పన్న నిజరూపం.. నేడే సాక్షాత్కారం
[ 10-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం శుక్రవారం సాక్షాత్కారం కానుంది. ఆలయంలో ఒంటి గంటకే అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. -
అటవీ హక్కుల చట్టానికి కేంద్రం తూట్లు: సీతారాం ఏచూరి
[ 10-05-2024]
దేశంలో లౌకికవాదం బతకాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
గోదావరిలో పడి విద్యార్థి మృతి
[ 10-05-2024]
ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బందితో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురువారంతో ముగిసింది. -
ఇసుక అక్రమాలు ఇన్నిన్ని కావయా!
[ 10-05-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు