మింగేసిన మూడంతస్తుల మేడ!!
ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకు విశాఖ వచ్చిన కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అద్దెకు ఉంటున్న ఇంటి రూపంలో ఆశలను సమాధి చేసింది.
అర్ధరాత్రి కుప్పకూలిన భవనం
ముగ్గురు దుర్మరణం
ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు బృందాలు
ఈనాడు-విశాఖపట్నం: ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకు విశాఖ వచ్చిన కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అద్దెకు ఉంటున్న ఇంటి రూపంలో ఆశలను సమాధి చేసింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఊహించుకొని...పిల్లలే ప్రాణంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. అప్పటి వరకూ సంతోషంగా కళ్లముందు తిరిగిన కొడుకు దుర్గాప్రసాద్, కూతురు అంజలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఊహించని పరిణామం. బుధవారం అర్ధరాత్రి జిల్లా పరిషత్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కూలిన దుర్ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణం శిథిల భవనమా? అధికారుల నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలో శిథిల భవనాల పరిశీలనా ప్రక్రియపై అనుమానాలు రేగుతున్నాయి.
వీరి ప్రాణాలు అలా దక్కాయి..
‘ఫాస్ట్ ఫుడ్’ సెంటర్లో పని చేసి ఆలస్యంగా వచ్చిన శివశంకర్... చోటూతో పాటు ఇంట్లో ఉన్నప్పటికీ నిద్ర పట్టకపోవడంతో కొంత మెలకువగా ఉన్నారు. అదే సమయంలో శబ్దాలు వస్తూ ఒక్కో అంతస్తు కుప్పకూలుతుండటంతో గమనించి పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చివరి అంతస్తులో ఉంటున్న కృష్ణ, రోజారాణి గాఢ నిద్రలో ఉన్నారు. భవనం కుప్పకూలే సమయంలో పై అంతస్తు వరకు పక్కకు ఒరిగి పడటంతో సమీపంలో ఇంటి నిర్మాణానికి ఉంచిన ఇసుక, మట్టి దిబ్బలపై వీరు పడ్డారు. రోజారాణిపై మంచం పడగా.. సిమెంటు శిథిలాలు మంచంపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. అంతస్తు ఒరిగినప్పుడు పక్కనే నిర్మాణంలో ఉన్న భవన పిల్లర్లపై పడినా భార్యాభర్తలిద్దరూ ప్రమాదంలో చిక్కుకునేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కూలిన భవనం
నలభై ఏళ్లు నాటిదిగా స్థానికులు చెబుతున్నారు. పైగా ఈ భవనాన్ని ఎలాంటి పిల్లర్లు లేకుండా నిర్మించారు. పునాదులు సైతం తక్కువలోతు తవ్వి ఏకంగా మూడంతస్తుల వరకూ నిర్మించారు. ఈ భవనం ఒమ్మి అప్పారావు పేరుతో ఉండగా, ఆయన తదనంతరం కుమారుల చేతికి వచ్చినట్లు సమాచారం. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అద్దెకు ఇచ్చారు. సాకేటి రామారావు కుటుంబం గత ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. ఈ పురాతన భవనాన్ని ఆనుకుని ఉన్న మరో పాత భవనం ఇటీవలే పడగొట్టి కొత్త నిర్మాణం చేపడుతున్నారు. పదిరోజుల కిందట ఈ నిర్మాణం సమీపంలో బోరు వేశారు. ఆ సమయంలో ప్రకంపనలు వస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తులు ఆ సమయంలో నిలిపివేశారు. రాత్రి సమయంలో మళ్లీ మొదలు పెట్టి బోరు వేసి వెళ్లిపోయారని క్షతగాత్రులు చెబుతున్నారు. బోరు వేయడానికి వాల్టా చట్టానికి లోబడే అధికారులు అనుమతులిచ్చారా? లేక అనధికారికంగా వేశారా? అనేది తేలాల్సి ఉంది. కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి కొన్ని వివాదాలు ఉండటంతో రాత్రిళ్లు చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
పెద్ద శబ్దం వచ్చింది: రాజు
నేను ఆటోడ్రైవరును. రాత్రి భోజనం చేసి పడుకున్నా. కొద్ది సేపటికే పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూస్తే పొగ మా ఇల్లంతా కమ్మేసింది. ఆ దూళికి ఇంట్లోవారికి ఊపిరి ఆడనంత పనైంది. వెంటనే బయటకు పంపించేశాను. కళ్లముందు భవనం కుప్పకూలి కనిపించింది. ఆ తర్వాత అందరం కలిసి ప్రాణాలతో ఉన్న వారిని బయటకు తీశాం.
భూకంపం వచ్చిందనుకున్నాం: ప్రకాశ్
భారీ శబ్దం రావడంతో భూకంపం వచ్చిందని భయపడ్డాం. కమ్మేసిన దుమ్ములో ఇద్దరు ప్రాణభయంతో అరుస్తూ కనిపించారు. వాళ్లని దూరంగా తీసుకొచ్చాక, క్షతగాత్రులను ఆసుపత్రికి పంపేందుకు సాయం చేశాం. బుధవారం దుర్గాప్రసాద్ పుట్టినరోజు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం కలిచివేసింది.
మంచం పడటంతో: రోజారాణి
నిద్రలో ఉండగా రెండో అంతస్తు నుంచి పక్కకు పడిపోయాం. నాపై మంచం పడటంతో బయటపడ్డాను. లేదంటే స్లాబు నాపై పడి ఉండేది. కొన్ని రోజుల క్రితం పక్కనే బోర్ వేశారు. ఆ సమయంలో ఇల్లు కొంత కంపించింది. ఆ తర్వాత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇలా కూలిందేమోననిపిస్తోంది.
చదివి పడుకున్నారు: కన్నప్పడు
ఇంటర్ పరీక్షలకు దుర్గా ప్రసాద్, పదో తరగతి పరీక్షలకు అంజలి రాత్రి వరకూ చదివి పడుకున్నారు.కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. మా అన్న(రామారావు) పిల్లలు ఆగస్టులో గొల్లలమర్రివలస గ్రామానికి వచ్చి నా కూతురు పెళ్లికి హాజరయ్యారు. పదేళ్లుగా విశాఖలోనే ఉంటున్నారు. వదినకు పిల్లలు చనిపోయిన విషయం ఇంకా తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. -
జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కృషి
[ 10-05-2024]
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్. -
అప్పన్న నిజరూపం.. నేడే సాక్షాత్కారం
[ 10-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం శుక్రవారం సాక్షాత్కారం కానుంది. ఆలయంలో ఒంటి గంటకే అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. -
అటవీ హక్కుల చట్టానికి కేంద్రం తూట్లు: సీతారాం ఏచూరి
[ 10-05-2024]
దేశంలో లౌకికవాదం బతకాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
గోదావరిలో పడి విద్యార్థి మృతి
[ 10-05-2024]
ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బందితో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురువారంతో ముగిసింది. -
ఇసుక అక్రమాలు ఇన్నిన్ని కావయా!
[ 10-05-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం