logo

తెదేపా మేనిఫెస్టోతో సరికొత్త అభివృద్ధికి నాంది

మహానాడు కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు సరికొత్త అభివృద్ధికి నాంది పలకనున్నాయని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే,

Published : 03 Jun 2023 02:39 IST

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వరి, వెంకటేశ్వరరావు

రంపచోడవరం, న్యూస్‌టుడే: మహానాడు కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు సరికొత్త అభివృద్ధికి నాంది పలకనున్నాయని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు, మహిళల సమక్షంలో పాలాభిషేకం చేశారు. ముందుగా దివంగత నేత ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, వంతల రాజేశ్వరి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపా అధికారం చేపడితే మహానాడులో మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత, తెదేపా మండల అధ్యక్షుడు కారం సురేష్‌, సర్పంచి అచ్చియమ్మ, నాయకులు అనంతమోహన్‌, మెహర్‌బాబాగౌడ్‌, వెంకన్న, కుంజం బాపన్నదొర, కారం శేషాయమ్మ, సింహాచలందొర, బుడ్డిగ రాజేంద్రవరప్రసాద్‌, దిడ్డి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు