మళ్లీ ప్రజాభిప్రాయసేకరణ..!
ఎన్నికల హామీగా మారిన బందరు పోర్టు నిర్మాణంలో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అసలు పనులు ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో
పోర్టు నిర్మాణంపై గందరగోళం
గిలకలదిండి రేవు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే : ఎన్నికల హామీగా మారిన బందరు పోర్టు నిర్మాణంలో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అసలు పనులు ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈనెల 15న పర్యావరణ సంబంధిత అంశాలపై బహిరంగ విచారణ నిర్వహించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
2006లో ఒకసారి..
బందరు పోర్టు నిర్మాణంపై 2006 సంవత్సరంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత ప్రణాళికలో వివిధ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 5వేల ఎకరాలకుపైగా భూమి అవసరం అవుతుందని, దానికి సంబంధించిన కసరత్తు చేశారు. ప్రస్తుతం అది 3,700 ఎకరాలకుపైగా మాత్రమే చాలని భావిస్తున్నారు. ఇలా విధానంలో మార్పులు చోటుచేసుకోవడంతోపాటు అప్పటి పరిస్థితులకు, ఇప్పటికి తేడా ఉంటుందని, అందుకే మళ్లీ పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ముడ అధికారులు దానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నెల 15న మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి వివిధ సంస్థలు, ప్రతిపాదిత పోర్టు పరిసర గ్రామాలకు చెందిన ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. దీనివల్ల జన జీవనానికి ఇబ్బంది ఉంటుందా, పర్యావరణ కలుషితం, ధ్వని, వాయు కాలుష్యంలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు తదితర అంశాలపై అభిప్రాయాలు తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు.
ముడ కార్యాలయం
దశలవారీగా ..
మచిలీపట్నం పోర్టుకు 2008లోనే శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా వివిధ కారణాలతో పనులు ఇంకా ప్రారంభం కాని దుస్థితి. దీంతో శంకుస్థాపనలతోనే సరిపెట్టినట్లయ్యింది. ప్రభుత్వం దాదాపు రూ.5,834 కోట్ల అంచనా వ్యయంతో తొలి దశలో 6 బెర్తులు నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడితోనే ఆగిపోయినట్లయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం దశలవారీగా నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తోంది. మొదటి దశలతో 3 బెర్తులు, బ్రేక్వాటర్స్, నావిగేషనల్ ఛానల్స్, ఫ్లోటింగ్క్రాప్ట్లు తదితరాలతో దాదాపు రూ.1860 కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా వేశారు. పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పరిపాలనా భవనం, 3 విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం, ఫెర్టిలైజర్స్, రసాయనాలు నిల్వచేసే గోదాములు, అగ్నిమాపకకేంద్రం తదితర పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇంకెంత అవసరం..?
ప్రస్తుతం పోర్టు నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి 3,762 ఎకరాల స్థలం అవసరం అవుతుందని నిర్ణయించారు. దీనిలో ఇప్పటికే ప్రభుత్వ భూమితోపాటు, కొనుగోలు చేసినది కలిపి 2,328 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఇంకా 1,434 ఎకరాలు అవసరం ఉండగా ల్యాండ్పూలింగ్లో 530 ఎకరాలకుపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు గత మూడేళ్లుగా కౌలు ఇవ్వడం లేదు. దీంతోపాటు వారికి అభివృద్ధి చేసిన స్థలం 1200 గజాలు ఇవ్వాల్సి ఉంది. రోడ్డు, రైలుమార్గాల అనుసంధానానికి కూడా కొంత భూమి కావాలి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థల సంబంధిత అంశాలపై కూడా మళ్లీ సమీక్షించనున్నారు.
కొంత భూమి సేకరించాల్సి ఉంది
పోర్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోడ్డు, రైలు మార్గాల అనుసంధానానికి కూడా కొంత భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి సర్వేచేయించి నివేదికను అందజేశాం. ప్రస్తుతం ఎంత భూమి ఉంది, ఇంకెంత అవసరం ఉంది, అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్భూమి ఉందా లాంటి అంశాలను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నాం. - శివనారాయణరెడ్డి, ముడ వీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందరు సాక్షిగా జగన్ అబద్ధాలు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు. -
జగన్ నిర్వాకం.. యువశక్తి నిర్వీర్యం
[ 07-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలచుకుంటే యువత గుండెలు బరువెక్కిపోతున్నాయి. కోపంతో రగిలిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయి.. జీవితంలో స్థిరపడలేక.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక.. వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి బలైపోయిన యువత దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
ఓటుకు రేటు..!
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో అది కీలక నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి లేక.. స్థానిక ప్రజాప్రతినిధి బూతులు వినలేక.. సకల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం ఈసారి స్పష్టమైన మార్పు కోరుతున్నారు. -
వివరాలు రాలేదని ఓటు వేయనీయలేదు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. -
నగరంలో రెడ్ జోన్ అమలు
[ 07-05-2024]
ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్జోన్ (నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. -
నాలుగు సార్లు గెలిపించినా.. నీరివ్వరేమని
[ 07-05-2024]
గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు. -
వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా
[ 07-05-2024]
ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. -
ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు
[ 07-05-2024]
ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. -
మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు
[ 07-05-2024]
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు. -
రాక్షస సంహారానికే కూటమి : నారా రోహిత్
[ 07-05-2024]
కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కుమారుడు వెంకట్, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడులో రోడ్షో నిర్వహించారు. -
నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు
[ 07-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
[ 07-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. -
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పోస్టల్ బ్యాలట్ సదుపాయం
[ 07-05-2024]
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలట్ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
నేటి నుంచి హోమ్ ఓటింగ్
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య