23న పెడనకు సీఎం జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెల 23న పెడనకు వస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. ఆ రోజు ఉదయం గం.10.30కు సీఎం ఇక్కడ ‘నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
సభాస్థలిని పరిశీలించిన ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల
పెడన తోటమూల సెంటర్ సమీపంలో చర్చిస్తున్న సీఎం ప్రోగ్రాం కన్వీనర్ రఘురాం. పక్కన మంత్రి రమేష్, కలెక్టర్ తదితరులు
పెడన, న్యూస్టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెల 23న పెడనకు వస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. ఆ రోజు ఉదయం గం.10.30కు సీఎం ఇక్కడ ‘నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తోటమూల జంక్షన్కు సమీపంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కలెక్టర్ రంజిత్బాషా, ఎస్పీ జాషువాలతో కలిసి మంత్రి మంగళవారం సమీక్షించారు.
సభాస్థలి పరిశీలన
పెడన - బంటుమిల్లి రహదారిపై స్థానిక తోటమూల జంక్షన్కు సమీపంలో ఖాళీగా ఉన్న పదెకరాల స్థలాన్ని సీఎం బహిరంగ సభ కోసం అధికారులు ప్రాథమికంగా ఎంపికచేశారు. హెలిప్యాడ్ను గూడూరు రోడ్డులోని నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఈ రెండింటినీ ప్రోగ్రాం కన్వీనర్ రఘురాం ప్రాథమికంగా పరిశీలించారు. అయితే సభస్థలికి ఆయన అంగీకారం తెలిపినా హెలిప్యాడ్ అక్కడికి దూరం అవుతుందని, మరో చోటకు మార్చాలని అధికారులకు సూచించారు. దీంతో హెలిప్యాడ్ ఎంపిక వాయిదాపడింది. అయితే బైపాస్ రోడ్డు లేదా సభాస్థలికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటుచేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
అధికారులతో సమీక్ష
అనంతరం మంత్రి, కలెక్టర్, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఎమ్మెల్సీ రఘురాంలు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశపు హాల్లో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రజారోగ్య విభాగాన్ని అప్రమత్తం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, పెడన మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 23 వరకు జిల్లా అధికారులు పెడనలోనే ఉండాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. పెడనకు 30 కి.మీ.ల దూరం నుంచి ప్రజలను సభాస్థలికి తీసుకురావాలని తలశిల రఘురాం సూచించారు. పెడన నియోజకవర్గంతో పాటు గుడ్లవల్లేరు, మచిలీపట్నంల నుంచి ప్రజలను పెడనకు తీసుకురావాలని చెప్పారు. ఒక్క పెడనలోనే 3161 మంది నేతన్న నేస్తం లబ్ధిదారులున్నారని, వీరిని చైతన్యపర్చి సభకు తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్ని సూచించారు. అలాగే పెడన కలంకారీ హస్తకళకు ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక జ్ఞాపికను అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేశ్కుమార్, డీఆర్వో వెంకటేశ్వర్లు, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కిషోర్, పద్మావతి, విజయకుమార్, డ్వామా పీడీ సూర్యనారాయణ, చేనేత జౌళిశాఖ ఏడీ రఘునంద, డీఎంహెచ్వో డా.గీతాబాయి, మత్య్సశాఖ జేడీ ఎ.శ్రీనివాసరావు, ముడా వీసీ నారాయణరెడ్డి, స్థానిక తహసీల్దార్ పి.మధుసూదనరావు, మున్సిపల్ ఛైర్పర్శన్ బీజీఎల్ జ్యోత్స్నారాణి, కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!