కదలికే లేదు..!
పోర్టు నిర్మాణం కలగానే మిగులుతోంది. నెలల వ్యవధిలోనే నిర్మిస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేయడం తప్పితే క్షేత్రస్థాయిలో ఒక్క అడుగుకూడా ముందుకు కదలడం లేదు. కొద్దిరోజులు టెండర్ల ప్రక్రియ చేపట్టామన్నారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ రివైజ్డ్ డీపీఆర్ తయారు చేయించారు.
నెలల వ్యవధిలోనే నిర్మిస్తారంట
పోర్టు నిర్మాణంపై ప్రకటనలతో కాలయాపన
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
పోర్టు నిర్మాణం కలగానే మిగులుతోంది. నెలల వ్యవధిలోనే నిర్మిస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేయడం తప్పితే క్షేత్రస్థాయిలో ఒక్క అడుగుకూడా ముందుకు కదలడం లేదు. కొద్దిరోజులు టెండర్ల ప్రక్రియ చేపట్టామన్నారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ రివైజ్డ్ డీపీఆర్ తయారు చేయించారు. తరువాత టెండర్ల ప్రక్రియను ఎట్టకేలకు ముగించారు. మొదటినుంచీ ఉన్న ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం చేపడతామని చెప్పి మళ్లీ నిర్ణయాన్ని మార్చుకుని పారిశ్రామిక అవసరాలకు భూములు గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా విడత విడతకూ విధానాలు మార్చుతూ కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది.
పోర్టుకు అనుబంధంగా రోడ్డు, రైలుమార్గానికి మండల పరిధిలోని పోతేపల్లి, కరగ్రహారం, అరిశేపల్లి, మేకవానిపాలెం, మాచవరం ప్రాంతాల్లో 200 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఏ గ్రామంలో ఎంత సేకరించాలి, ఆ గ్రామాల్లో అసైన్డ్, పట్టాభూమి ఎంత ఉందో లెక్కగట్టారు. వీటికి సంబంధించిన సర్వే పూర్తిచేసి నెలలు గడచిపోతున్నా ఇంతవరకు సేకరణ ప్రక్రియ ఊసేలేదు. అవసరమైన 200 ఎకరాల్లో 10ఎకరాలు అసైన్డ్ భూమి, మిగిలిన 190 ఎకరాలు పట్టాభూమి ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సేకరించడానికి రూ.100 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఆయా గ్రామాల మీదుగా మచిలీపట్నం-విస్సన్నపేట జాతీయ రహదారి వరకు 8 కిలోమీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం భూములు గుర్తించడం తప్ప సమీకరణ ప్రారంభించలేదు. ఫలానా సమయంలో చేస్తామన్న విషయాన్ని కూడా పాలకులు స్పష్టత ఇవ్వడం లేదు. ఇలా క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకుండా పోర్టు నిర్మించేస్తామని చెప్పడం పట్ల ప్రజలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాలుపోని అధికారులు
ఓ పక్క ఇప్పటికే గుర్తించిన భూమి సమీకరణ జరగలేదు...తాజాగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు గుర్తించి సిద్ధం చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అధికార వర్గాల చెబుతున్నాయి. మొదటి దశలో నిర్మించే నాలుగు బెర్తుల ద్వారా ఆక్వా ఉత్పత్తులు, గ్రానైట్స్, సిమెంట్, ఇనుము బియ్యం ఇలా వివిధ రకాలు కలిపి 26.12 మిలియన్ టన్నులు కార్గో రవాణా జరుగుతుందని భావించి, దానికి అనుగుణంగా ఏర్పాటయ్యే పరిశ్రమల అవసరాలకు భూములు గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 3,778 ఎకరాల భూమిని ప్రభుత్వం మచిలీపట్నం పోర్టుకు కేటాయించింది. అందులో 1931 ఎకరాలు తొలివిడత పనులకు అవసరం అవుతాయని నిర్ణయించారు. మళ్లీ భూములు గుర్తించాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రోడ్డు, రైలుమార్గంతోపాటు ముందుగా పోర్టు సంబంధిత కార్యకలాపాలు నిర్వహించేందుకు గానూ వెంటనే పోర్టు భవనం నిర్మించాల్సి ఉంది. ఇందుకు 26 ఎకరాలు అవసరమవుతుంది. తపశిపూడి ప్రాంతంలో ఈ భూమిని అధికారులు గుర్తించారు. ఇది అసైన్డ్ అయినా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలామంది చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూమిపై ఎవరు అనుభవదారుడిగా ఉన్నా ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చు. ఆ అసైన్డ్భూముకు చెందిన రైతులకు కూడా డబ్బులు చెల్లించాలని పాలకులు పట్టుబడుతున్న తరుణంలో ప్రభుత్వ భూములు సేకరించడం అధికారులకు సవాలుగా మారింది.
ఇది నిరంతర ప్రక్రియ
పోర్టు నిర్మాణంతోపాటు పరిశ్రమల ఏర్పాటు తదితర అవసరాలకు భూములు సమీకరించడం అనేది నిరంతర ప్రక్రియ. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు, రైలు మార్గం అనుసంధానానికి వివిధ గ్రామాల్లో గుర్తించిన భూముల సమీకరణకు అవసరమైన నిధులు ఉన్నాయి. నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తున్నాం. రైల్వేశాఖ అనుమతులు కూడా రావాల్సి ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఆదేశాలు వచ్చిన వెంటనే భూములు సమీకరిస్తాం. శాఖాపరంగా నిర్వహించే పనులు వేగవంతం చేసేలా కృషి చేస్తున్నాం.
-విద్యాశంకర్, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..