అమలుకాని నిషేధం ఆచరణలో వైఫల్యం
యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవటంలేదు.
పెడనలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం
ప్రేక్షక పాత్రలో పురపాలక అధికారులు
పెడన, న్యూస్టుడే
సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు (పాత చిత్రం)
యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవటంలేదు. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో ఆనెల ప్రారంభంలో మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా పట్టణ వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. ఇందులో పట్టుబడిన ప్లాస్టిక్ ఉత్పత్తులను మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించి ధ్వంసం చేశారు. దీంతో అప్పట్లో వర్తకులు, వినియోగదారులు కూడా నిషేధిత ప్లాస్టిక్ను వాడేందుకు వెనుకంజ వేశారు. కొద్దిరోజుల తరువాత పరిస్థితులు మామూలయ్యాయి.
నిలిచిన తనిఖీలు: గత రెండ్నెళ్లుగా పట్టణంలో మున్సిపల్ అధికారులు దాడులు చేయలేదు.ఫలితంగా ప్లాస్టిక్ వినియోగం తిరిగి మొదలైంది. ప్రధానంగా హోటళ్లు, పచారీ, మాంసాహార తదితర దుకాణాల్లో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం పూర్వస్థితికి చేరుకుంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రోజుకు దాదాపు 500 కిలోలకు పైగా నిషేధిత ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నట్లు ఒక సర్వే ద్వారా వెల్లడైంది. వాటిని వినియోగించిన తర్వాత రహదార్లపై పడేయటంతో ఆవ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఫలితంగా యార్డులో ఆయా ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి. నిబంధనలను కాదని ఎవరైనా వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదట్లో జరిమానాలు విధించడంతో వర్తకులు వెనుకంజ వేశారు. ఆ తర్వాత పట్టించుకోపోవటంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇటీవల ప్లాస్టిక్ ఫ్లెక్సీలను కూడా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినా అది కూడా అమలు కావడం లేదు.
డంపింగ్ యార్డ్లోకి చేరుతున్న వ్యర్థాలు
యథేచ్ఛగా టోకు విక్రయాలు: పెడనకు విజయవాడ నుంచి నిషేధిత ప్లాస్టిక్ సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. విజయవాడ పరిసరాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను పెడనకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఇలా విజయవాడలోని టోకు వర్తకుల నుంచి పెడనలోని రిటైల్కు చేరుతున్నాయి. అక్కడి నుంచి వినియోగదారులకు అందుతున్నాయి. అధికారులు ప్రారంభంలో దాడులు చేయడంతో ప్రతి దుకాణం ఎదుట చేతి సంచులు ఇవ్వమని బోర్డులు పెట్టారు. కొంతమంది ఆస్థానంలో నార సంచులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్తో పోల్చితే వాటి ధరలు అధికం కావడంతో ఆ తర్వాత వెనుకంజ వేసి తిరిగి ప్లాస్టిక్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పెడనలో ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తాం. పట్టణంలో వినియోగం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సచివాలయ సిబ్బందితో దాడులు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశిస్తాం. పట్టణంలోని 9 వార్డు సచివాలయాల అడ్మిన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. సచివాలయాల పరిధిలో ప్లాస్టిక్ వినియోగం జరిగితే అక్కడి ఉద్యోగుల్ని బాధ్యులు చేస్తాం.
- బీజీఎల్ జ్యోత్స్నారాణి, మున్సిపల్ ఛైర్పర్సన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత