ధాన్యం.. రైతు దైన్యం..!
ఏటా పంట చేతికొచ్చే సమయంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
బందరు మండలం పోతేపల్లిలో వెంచర్లో ఆరబెట్టిన ధాన్యం
మచిలీపట్నం కార్పొరేషన్, తోట్లవల్లూరు, న్యూస్టుడే: ఏటా పంట చేతికొచ్చే సమయంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల వచ్చిన వాయుగుండం నుంచి తప్పించుకున్నామని సంతోషిస్తున్న సమయంలోనే మళ్లీ అల్పపీడనం ఏర్పడటం, పలు చోట్ల వర్షాలు పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి మంచి దిగుబడులు వస్తుండగా, వాతావరణంలో వస్తున్న మార్పులు, క్షేత్రస్థాయిలో తేమ శాతం నిబంధనతో ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. చేలో పంట చేతికి అందేనా?
వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలను బట్టి ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గూడూరు, మొవ్వ, పెడన, గుడ్లవల్లేరు తదితర మండలాల్లో చేసిన పంట కోత ప్రయోగాల్లో కూడా 36 బస్తాలకు పైగా దిగుబడులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు పడడంతో పండిన పంట చేతికొస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 3.94 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కోతలు కోశారు. ప్రస్తుతం 25 వేల ఎకరాలకు పైగా కోతలు పూర్తయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని మండలాల్లో పంట కోతకు రాగా, చాలామంది ఆకాశం మేఘావృతం అయ్యిందని కోతలు కోయడానికి ఆలోచిస్తున్నారు.
తోట్లవల్లూరులో నీటిలో నానుతున్న పనలు
బాధ్యత ఎవరిది..?
వాయుగుండం, అల్పపీడన సమస్యలతోపాటు కూలీల కొరత తదితర కారణాలతో రైతులు ఎక్కువశాతం మంది యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏమాత్రం రైతులను ఆదుకోలేక పోతున్నాయి. వ్యాపారుల ప్రమేయం లేకుండా కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వం విధించిన నిబంధన అన్నదాతల పాలిట శాపంలా తయారైంది. కేంద్రాలకు విక్రయించాలంటే తేమ 17 శాతం లోపు ఉండాలి. ఆ నిబంధనతో ప్రస్తుతం ధాన్యాన్ని విక్రయించడం సాధ్యమా అంటే రైతులు నూరుశాతం వీలుకాదని అంటున్నారు. ఒక వేళ ఆరబెట్టాలన్నా ఎక్కువ ఖాళీ ప్రదేశాలు లేవు. చాలా చోట్ల ధాన్యం రహదారుల పక్కన, పొలాల దిబ్బలపైన రాశులుగా ఉండిపోయింది. వారం, పదిరోజుల పాటు ఆరబెట్టాలంటే పరదాలకు కూడా ఖర్చుకు ఎక్కువ అయిపోతుందని, ఈలోపు వర్షం పడి పంట నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, పెడన తదితర మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఇన్ని నిబంధనలా..!
8 ఎకరాల ధాన్యం విక్రయించడానికి సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రానికి వెళితే ఆరబెట్టి తీసుకురావాలంటున్నారు...అంత ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలి. మా పొలం పక్కన మిల్లు ఉంది. ట్రాక్టర్తో తీసుకెళ్లి ఇస్తే డబ్బులు ఇచ్చేవాళ్లు. మా ధాన్యం అమ్మడానికి కూడా ఇన్ని నిబంధనలు ఏమిటో అర్థం కావడంలేదు.
ప్రత్తిపాటి శ్రీనివాసరావు, రైతు, మల్లవోలు
ఆరబెడితే మంచి ధర వస్తుంది
ఆరబెడితే మంచి ధర వస్తుందన్న విషయాన్ని రైతులు గమనించాలి. యంత్రాలతో కోసే సమయంలో మట్టి, తాలు లాంటివి రాకుండా జల్లెడ ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తేమశాతం ఎక్కువ ఉన్నా కేంద్రాలను సంప్రదిస్తే పరిశీలించి ధర నిర్ణయిస్తారు.
శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ, మేనేజర్
జాగ్రత్తలు పాటిస్తే కాపాడుకోవచ్చు
రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవచ్చు. పల్లపు పొలాల్లో నీరు నిల్వకుండా కాలువలు తీసి బయటకు తరలించాలి. తడిసిన పనలు మొలకలు రాకుండా వరిపై ఒక లీటరు నీటిలో 5 శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలి.
నాగేశ్వరరావు, ఏవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి