అన్నం... పచ్చడి... రూ.20
పచ్చడితో అన్నం పెట్టి, ఆయాతో కర్రీ తెప్పించుకోమని రూ.20 పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఇవ్వడం ఇప్పుడు చాలా ఇళ్లల్లో కనిపిస్తోంది. యూకేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు తెచ్చుకుంటున్న లంచ్ బాక్సులను పరిశీలిస్తే దాదాపు 30 శాతం ఇలానే ఉంటున్నాయి.
బడుల్లో సుమారు 30 శాతం ‘లంచ్ బాక్సుల’ తీరు
న్యూస్టుడే, గుణదల
పచ్చడితో అన్నం పెట్టి, ఆయాతో కర్రీ తెప్పించుకోమని పాఠశాలలకు వెళ్లే పిల్లలకు రూ.20 ఇవ్వడం ఇప్పుడు చాలా ఇళ్లల్లో కనిపిస్తోంది. యూకేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు తెచ్చుకుంటున్న లంచ్ బాక్సులను పరిశీలిస్తే దాదాపు 30 శాతం ఇలానే ఉంటున్నాయి. విద్యార్థులు తరచూ అనారోగ్యాలకు గురవుతూ బడులకు డుమ్మా కొడుతున్నారు. మధ్యాహ్న భోజనం బెల్ కొట్టడానికి ముందు ప్రతి తరగతి గదికి ఆయాలు వెళ్లి ఎవరికి ఏం కూరలు తేవాలో అడిగి పట్టిక తెచ్చుకుంటున్నారు.
బడి బస్సుల సమయాలు:
నగరాలు, పట్టణాల్లోని పాఠశాలలు ఉదయం 8:30 గంటలకు మొదలైతే, ఆయా బడులకు పిల్లలను తీసుకువచ్చే బస్సులు, ఇతర వాహనాల పయనం ఉదయం 6:30 నుంచే మొదలవుతుంది. ఆ సమయానికి రెడీ కావాలంటే వారు, కుటుంబం మొత్తం కనీసం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేవాలి. ఏం తేడా వచ్చినా పిల్లలకు పచ్చడి మెతుకులే గతి.
రాత్రి ఆలస్యంగా నిద్ర పోవటం:
వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే పెద్దలు, బడుల నుంచి పిల్లలు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఇళ్లకు చేరుకుంటున్నారు. అనంతరం స్నానపానాదులు పూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసి వెంటనే నిద్రపోవటం అనేది నేటి పరిస్థితుల్లో సాధ్యం కావటం లేదు. పిల్లలు ఆన్లైన్ గేమ్స్, పెద్దలు సామాజిక మాధ్యమాలలో మునిగిపోయి... వారు నిద్ర పోయే సమయం అర్ధరాత్రికి కొంత అటూఇటూగా ఉంటుంది. దీనితో తెల్లవారుజామున నిద్ర లేవటం అనేది వారికి కష్టతరంగా మారుతుంది. ఫలితం లంచ్ బాక్స్పై పడుతుంది.
ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావటం:
ఇప్పుడు అత్యధిక శాతం కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల పని ఒత్తిడి, రాకపోకల సమయం వంటి వాటి వల్ల జీవన శైలి హడావుడిగా మారుతోంది. ఈ కారణాలన్నింటితో పాటు ఇంటి పట్టున ఉండే కొందరు సాధారణ గృహిణులు పంపే లంచ్ బాక్సులూ అన్నం పచ్చడితోనే ఉంటున్నాయని ఆయాలు చెబుతున్నారు.
సమయ పాలన పాటిస్తే అంతా బాగు
సమయపాలనే ముఖ్యమని గుణదలకు చెందిన వాణి అనే ఉద్యోగిని చెబుతున్నారు. ఉద్యోగి అయిన తన భర్త, ఇద్దరు టీనేజ్ పిల్లలు అంతా ఉదయమే బయటకు పోవాలి. అందుకే అందరం కలసి పనిచేసుకుంటాం. ఉదయం లేచాక కాసేపు వ్యాయామం, ధ్యానం చేశాక అల్పాహారం మొదలు సాయంత్రం వరకు అవసరమైన పోషకాహారాన్ని సిద్ధం చేసుకుని ఎవరి బాక్స్లు వారు కట్టుకుంటాం. ఎక్కడా ఒత్తిడికి గురవ్వకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నామని వాణి చెబుతున్నారు.
చిప్స్ నంజుకోవడం
క్యాంటీన్లో చిప్స్ ప్యాకెట్ కొనుక్కోమని కొందరు గృహిణులు పిల్లలకు చెబుతున్నారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి చిప్స్, చాక్లెట్ ఇస్తున్నారు. కొన్ని మినహాయిస్తే చాలావరకు చిప్స్కు ఎంఎస్జీ (మోనో సోడియం గ్లోటెమేట్) అనే లవణ పదార్థం వాడతారు. అధికమైన కొవ్వు పదార్థం ఉంటుంది. ఫలితంగా విద్యార్థులు దేనిపైనా అంతగా ఆసక్తి చూపలేకపోవడం, ఒక చోట నిలకడగా ఉండలేకపోవడం ఇతర సమస్యలు వస్తున్నాయి.
డా.చందు విన్నెల, విజయవాడ
ఆహారమే ఆయుష్షు
పిల్లలకైనా, పెద్దలకైనా ఆహారమే ఆయుష్షు అని అందరూ తెలుసుకోవాలి. రోజూ సుమారు రెండు గంటలు దీని తయారీకి వెచ్చిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. రోజూ ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మినరల్స్, కొవ్వులు కచ్చితంగా కావాలి. జంక్ ఫుడ్స్ కారణంగా ఏ, డీ, ఈ, కే విటమిన్లు లోపాలు వస్తున్నాయి. ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
డాక్టర్ వెంకటరమణ, పిల్లల వైద్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత