జాతీయ జూడో పోటీలకు మొవ్వ విద్యార్థుల ఎంపిక
అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో ఆడేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం జూడో జట్టులోకి మొవ్వ వీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మాధవి తెలిపారు.
క్రీడాకారులతో మణిప్రసాద్
మొవ్వ(కూచిపూడి), న్యూస్టుడే: అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో ఆడేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం జూడో జట్టులోకి మొవ్వ వీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మాధవి తెలిపారు. విజయవాడ సప్తగిరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుని ఎంపిక చేశారు. ఇందులో మొవ్వ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల బీఏ మూడో సంవత్సరం విద్యార్థులైన జి.ఉషశ్రీ, పి.అభిషేక్, ఎస్.చందు ఎంపికయ్యారు. పంజాబ్లో జనవరి 6 నుంచి జరిగే అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున వీరు ఆడనున్నారు. ఎపికైన విద్యార్థులను శనివారం ప్రిన్సిపల్ మాధవి, పి.డి.మణిప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు..
క్రీడాకారులను అభినందిస్తున్న ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు
అవనిగడ్డ, న్యూస్టుడే: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు స్థానిక ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల విద్యార్థులు అండర్ 18 ఖోఖో పోటీలకు తెనాలి జ్యోతి, యు.లక్ష్మీనారాయణమ్మ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు చెప్పారు. నవంబర్ 29న మైలవరంలోని ఎస్ఎస్కే పాఠశాలలో జరిగిన ఖోఖో ఎంపికల్లో వీరు పాల్గొని ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు చెప్పారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.
ఎస్జీఎఫ్లో...
ఉడుముల అఖిల్దీప్ (మొవ్వ) కైలా వెంకటలక్ష్మి (చినముత్తేవి)
చినముత్తేవి(కూచిపూడి), న్యూస్టుడే: మొవ్వ మండలం చినముత్తేవి జడ్పీపాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి బాలికల అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఎన్.శేషసాయికుమార్ తెలిపారు. గుడివాడలో జరిగిన జిల్లాస్థాయి బాలికల అథ్లెటిక్స్లో అండర్ 17 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమం, 1500 మీటర్ల పరుగు పందెంలో 2వ స్థానం సాధించి బాలికల విభాగంలో రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు చెప్పారు. మొవ్వ శ్రీమండవ కనకయ్య జడ్పీ విద్యార్థి ఉడుముల అఖిల్దీప్ అండర్ 17 షాట్ఫుట్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడని హెచ్మ్ ఎన్.వి.శ్రీధర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్