పంపిణీ ఉన్నట్టా.. లేన్నట్టా?
‘ఈ నెల 21న సీఎం పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభకు అక్కడే ఏర్పాట్లు చేయాలి.
పూర్తికాని మౌలిక సౌకర్యాల పనులు
త్రిశంకు స్వర్గంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
ఈనాడు, అమరావతి
వాటర్హెడ్ ట్యాంకు కోసం తీస్తున్న గుంత
‘ఈ నెల 21న సీఎం పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభకు అక్కడే ఏర్పాట్లు చేయాలి. పక్కనే ఉన్న వరి పొలంలో రెండో పంట సాగు చేయవద్దు..! సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోండి..!’ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) గత నెలలో చెప్పిన మాటలు..!
పై చిత్రం పరిశీలించారా..!
గుడివాడ టిడ్కో ఇళ్ల సమీపంలో ఉన్న పొలాలు. రైతులు శనివారం దమ్ము చేయిస్తున్నారు. దాదాపు 14 ఎకరాలు. ముందుగా రెండో పంట మినుము సాగు చేస్తారు. వరి కోతలు అయిన వెంటనే మినుము విత్తనాలు చల్లుతారు. ఈ సమయానికి మొలకెత్తాల్సి ఉంది. కానీ మాజీ మంత్రి ఆదేశాలతో రైతులు విత్తనాలు వేయలేదు. అధికారులు కౌలు సొమ్ము చెల్లిస్తామని ముందు చెప్పి ఇప్పుడు లేదని అంటున్నారు. దీంతో రైతులు దమ్ము చేసి కొంత ఆరిన తరన్వాత మినుము విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారుల వ్యవహారం వల్ల రైతులకు పంట జాప్యం కావడమే కాకుండా దమ్ము చేసేందుకు అదనపు వ్యయం భారంగా మారింది. ఎకరానికి రూ.1500 వరకు ఖర్చు అవుతోంది. ఇంతకీ 21న సీఎం కార్యక్రమం ఉందా లేదా అనేది సందేహం. సీఎం కార్యక్రమం ఉంటే.. మళ్లీ పైరు ఎక్కడ తొక్కేస్తారోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వీరంతా కౌలు రైతులు కావడం గమనార్హం.
అసంపూర్తిగానే..!
టిడ్కో ఇళ్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ సీఎం ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా గుడివాడలో ఈ కార్యక్రమం ఈనెల 21న ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ధ్రువీకరణ కాలేదు. ఉంటుందా లేదా అనేది అధికారులు సైతం ధ్రువీకరించడం లేదు. బహిరంగ సభ పేరుతో రైతులను పంట సాగు చేయవద్దని మాజీ మంత్రి హెచ్చరించడం వివాదంగా మారింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కానీ ప్రారంభోత్సవానికి హడావుడి చేస్తున్నారు. గుడివాడలో జిల్లాలోనే అత్యధికంగా 8912 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి తెదేపా హయాంలో జిల్లాలో మొత్తం 91వేల ఇళ్లు మంజూరు కాగా.. వాటిని ప్రస్తుతం 27,872కే కుదించారు. అంతవరకు పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికే బ్యాంకుల నుంచి రుణాలు లభించడం లేదు. మౌలిక వసతులు కల్పించలేక ఆపసోపాలు పడుతున్నారు.
* విజయవాడ జక్కంపూడి కాలనీలో భారీ ఎత్తున అయిదు దశల్లో దాదాపు 55వేల ఇళ్లు నిర్మాణం చేపట్టాలనేది లక్ష్యం. వీటికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాట్మెంట్ పత్రాలు కూడా అందజేశారు. ఇప్పుడు వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ 6576 మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతుల ఊసేలేదు. ఇంకా విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లు నిర్మాణం చేసినా సెప్టెక్ ట్యాంకులు నిర్మాణం చేయలేదు. మంచినీటి వసతి కల్పించలేదు. ఇవి నివాసయోగ్యంగా మారాలంటే పూర్తి స్థాయిలో వసతులు కల్పించాల్సి ఉంది. రహదారి సౌకర్యం లేదు. కొండచుట్టూ నిర్మాణం చేశారు.
* జగ్గయ్యపేట, మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, నూజివీడులలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కావడం లేదు. మౌలిక వసతుల మాట దేవుడెరుగు అన్నట్లు ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. * జిల్లాలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లలో డిసెంబరులో గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. కనీసం 2,500 టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలను చేయాలనేది లక్ష్యం. గృహప్రవేశాలు చేసినా నివాసం ఉండేందుకు మరికొంత గడువు పడుతుంది. అధికారులు మాత్రం గుడివాడలో సీఎం కార్యక్రమంపై పెదవి విప్పడం లేదు. ఉంటుందో ఉండదో ఏదీ తేల్చుకోలేని పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల