సుబాబుల్ రైతుల నిలువు దోపిడీ!
సుబాబుల్ రైతులను కొన్ని కాగిత కర్మాగారాలు, దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. టన్నుకు రూ. 4200 ఒప్పంద ధర ఇవ్వాల్సి ఉండగా.. రైతు చేతికి రూ.2400 రావడం గగనంగా మారింది.
నందిగామ, న్యూస్టుడే
లారీకి కర్ర ఎక్కిస్తున్న కూలీలు
సుబాబుల్ రైతులను కొన్ని కాగిత కర్మాగారాలు, దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. టన్నుకు రూ. 4200 ఒప్పంద ధర ఇవ్వాల్సి ఉండగా.. రైతు చేతికి రూ.2400 రావడం గగనంగా మారింది. వాస్తవానికి లారీ కిరాయి, కర్ర లోడింగ్ ఛార్జీలు కాగిత కర్మాగారాలు భరించాలి. అందుకు విరుద్ధంగా ఆయా ఛార్జీలను ఒప్పంద ధరలోనే కోత విధిస్తున్నారు. గతంలో ఉన్న డంపింగ్ యార్డుల వ్యవస్థ, మార్కెట్ యార్డుల పర్యవేక్షణ రద్దు చేశారు. ప్రస్తుతం ట్రేడర్ల ద్వారా కర్మాగారాలు కర్ర కొనుగోలు చేస్తుండగా.. సరైన ధర లభించక రైతులు మాత్రం భారీగా నష్టపోతున్నారు.
50 వేల ఎకరాల్లో..
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో సాగు ఉంది. కర్మాగారాలకు ఉన్న కర్ర డిమాండ్కు అనుగుణంగా ఒప్పంద ధరకు రెండు, మూడు వందల రూపాయలు పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. లారీ కిరాయి పెరిగిందని చెప్పి ఆ మేరకు కోత విధిస్తున్నారు. ఫలితంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. నందిగామ, వత్సవాయి మండలాలకు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోని మధిర, బోనకల్లు ప్రాంతంలో ఒక కర్మాగారం టన్నుకి రూ.2600 చెల్లిస్తుండగా, ఏపీలో మాత్రం రూ. 2400 ఇస్తోంది. ఒక కర్మాగారం ప్రతినిధులు నందిగామ ప్రాంతంలో కంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో టన్నుకి రూ. 200 తక్కువ చెల్లిస్తోంది. ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. వాస్తవంగా రైతులు కర్ర నరికించినందుకు, డంపింగ్ యార్డు వద్దకు రవాణా చేయడానికి అయ్యే ఖర్చు తీసి వేస్తే సుమారు రూ.3450 వరకు అందాలి. కానీ వివిధ ఖర్చుల రూపేణా కోత పెట్టి రూ.2400 వరకు ఇస్తున్నారు. మార్కెట్ యార్డుల పర్యవేక్షణలో కొనుగోలు చేసేందుకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. లారీ కిరాయి, లోడింగ్ ఖర్చులు పేపరు కర్మాగారాలే భరించేలా చర్యలు తీసుకోవాలి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా కనీసం టన్నుకు రూ. ఐదు వేల ధర లభించేలా చూడాలి. దళారులు, ట్రేడర్ల వ్యవస్థ రద్దు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
నాడు పాదయాత్ర.. నేడు పట్టించుకోరు
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఏమీ పట్టించుకోవట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాలని పాదయాత్రలు, ఆందోళనలు చేసిన ముఖ్య నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు విప్పట్లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక టన్నుకి రూ. ఐదు వేలు ఇస్తామని నందిగామ ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మూడున్నరేళ్లయినా పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సుబాబుల్ రైతుల సమస్యలపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినా నేటికీ నిర్ణయం తీసుకోలేదు. ఏటా తీవ్రంగా నష్టపోతున్నా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్