logo

విద్యార్థులకు రూ.6.81 లక్షల ఉపకార వేతనాల పంపిణీ

ప్రతిభా వంతులైన పేద విద్యార్థులకు గొర్రెపాటి విద్యాట్రస్టు ఆధ్వర్యంలో ఏటా ఉపకార వేతనాలు అందించడం స్ఫూర్తిదాయకమని సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 03:54 IST

ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులతో అతిథులు

చల్లపల్ల్లి, న్యూస్‌టుడే: ప్రతిభా వంతులైన పేద విద్యార్థులకు గొర్రెపాటి విద్యాట్రస్టు ఆధ్వర్యంలో ఏటా ఉపకార వేతనాలు అందించడం స్ఫూర్తిదాయకమని సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి పేర్కొన్నారు. చల్లపల్లిలోని విజయా అకాడెమీలో గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయ భాస్కరమ్మ విద్యా ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఘంటసాల, చల్లపల్లి మండలాలకు చెందిన పదో తరగతి, ఉన్నత విద్యనభ్యసించే 124 మందికి రూ.6.81 లక్షల ఉపకార వేతనాలు అందజేశారు. కరస్పాండెంట్‌ గొర్రెపాటి చంద్రశేఖరరావు, ప్రిన్సిపల్‌ నాగళ్ల భీమారావు, ట్రస్టు సభ్యులు గొర్రెపాటి వెంకటరామకృష్ణ, ఏవో వేమూరి విశ్వేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు మాలెంపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని