ధగధగల మాటున.. దగా
అది టోకు, చిల్లర అమ్మకాలు జరిపే బంగారం నగల దుకాణం. అక్కడికి వెళ్లిన వినియోగదారులను మొదట సిబ్బంది అడిగే ప్రశ్న.. బిల్లు కావాలా..? అయితే 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బి
రూ.కోట్లలో పన్ను ఎగవేత
ఈనాడు, అమరావతి: అది టోకు, చిల్లర అమ్మకాలు జరిపే బంగారం నగల దుకాణం. అక్కడికి వెళ్లిన వినియోగదారులను మొదట సిబ్బంది అడిగే ప్రశ్న.. బిల్లు కావాలా..? అయితే 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు లేకుండా అయితే.. ఇది మిగులుతుంది. బంగారం నాణ్యత, బరువు, దుకాణ యజమానిపై నమ్మకంతో ఎక్కువ శాతం బిల్లులు లేకుండానే కొనుగోలు చేస్తుంటారు. ఆ ఆభరణం వెంటనే అదే దుకాణాల సముదాయంలో నాణ్యత, తూకం పరీక్ష చేయించుకోవచ్చు. రూ.50 చెల్లిస్తే.. నాణ్యత ఎంత ఉంది..? తూకం ఎంత ఉంది..? ధ్రువీకరణ ఇస్తారు. దీంతో ఎక్కువ మంది వినియోగదారులు బిల్లులు లేకుండానే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వ పన్నుల విభాగానికి రూ.కోట్లలో నష్టం వస్తుంది. అంతా అక్కడ ‘జీరో’ వ్యాపారమే! వ్యాపారులు కొనుగోలు చేసిన దానిపై పన్నులు ఉండవు. విక్రయించే దానిపై పన్నులు ఉండవు.
ముంబయి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యక్తి ఇటీవల బంగారు ఆభరణాలు.. తీసుకొస్తుండగా విజయవాడ టాస్క్ఫోర్సు పోలీసులకు చిక్కారు. అంతే క్షణాల్లో వాట్సప్లో బిల్లులు ప్రత్యక్షమయ్యాయి. అంతా గప్చుప్..!
ఓ కొనుగోలుదారుడు రూ.10లక్షల విలువ చేసే హారం ఓ దుకాణంలో కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో దీనికి కనీసం 15 శాతం నుంచి డిజైను బట్టి 22 శాతం వరకు వీఏ (వాల్యూ యాడెడ్, తరుగు) వసూలు చేస్తారు. కానీ ఆ దుకాణంలో 5శాతం నుంచి 6శాతం వసూలు చేస్తారు. దీంతో కొనుగోలుదారులు ఆకర్షితులు అవుతారు. 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10లక్షల విలువపై దాదాపు రూ.30వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మిగులుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ దుకాణాల సముదాయం, మరో ప్రైవేటు దుకాణాల సముదాయం ఈ జీరో వ్యాపారానికి పెట్టింది పేరు. గవర్నర్పేటలో, ఒకటో పట్టణంలో రోజుకు కనీసం రూ.30కోట్ల నుంచి 40 కోట్ల వరకు జీరో వ్యాపారం జరుగుతుందని అంచనా. నెలకు సుమారు రూ.50కోట్ల వరకు జీఎస్టీ ఎగవేస్తున్నారు. జీఎస్టీతో పాటు ఆదాయ పన్నులోనూ కోత పడుతోంది.
ఠంచనుగా లంచాలు..
ఒక సిండికేట్ ద్వారా కొంతమంది ఉద్యోగులకు లంచాలు అందుతుంటాయి. కేసులు అవసరమైతే వెండి ఆభరణాలపై ఒకటీ అరా నమోదు చేస్తుంటారని తెలిసింది. బంగారం వ్యాపారానికి మాత్రం వెళ్లరు. ఆదాయపుపన్ను శాఖ వాళ్లు పట్టుకున్నప్పుడు, దొంగలపాలైనప్పుడు రశీదులు అవసరం ఉంటాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తెరగడం లేదు.
ఇదీ పరిస్థితి..
విజయవాడలో బంగారు ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ది చెందిన దుకాణ సముదాయంలో బడా నగల దుకాణాల కంటే వీఏ తక్కువగా ఇస్తుంటారు. జీఎస్టీ వసూలు చేయరు. అయితే సొమ్ములు మొత్తం నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు ఆభరణాలను తరలిస్తుంటారు. వాటికి జీఎస్టీ వసూలు చేయరు. ఆ దుకాణాల వైపు పన్నుల శాఖ అధికారులు అసలు కన్నెత్తి చూడరు. తూనికలు-కొలతల శాఖ అధికారులు సైతం బడా సంస్థలు నిర్వహిస్తున్న దుకాణాలపై మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ గ్రాము వద్ద బయట మార్కెట్ కంటే రూ.50 నుంచి 100 వరకు తగ్గింపు ఇస్తుంటారు. సాధారణంగా బిస్కెట్ బంగారం ప్యూరిటీ 99.99శాతం క్యారెట్లు ఉంటుంది. కానీ ఇక్కడ బంగారం 99.60శాతం ఉంటుందని ఓ వ్యాపారి వివరించారు. ఎక్కువగా బంగారం బిస్కెట్లు, ఆభరణాలు రైల్వే ద్వారా అక్రమ రవాణా అవుతున్నాయి. ఇలా బంగారం తెచ్చే వారిని కొంతమంది వెంబడించి దోచుకున్న సంఘటనలు నవజీవన్ ఎక్స్ప్రెస్లోనే జరిగాయి. విశాఖపట్నం వెళ్లే మార్గంలోనూ జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక