రెండు మండలాలుగా మచిలీపట్నం
రాష్ట్రంలోనే అతిపెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గాల్లో మచిలీపట్నం ముందు వరుసలో ఉంటుంది. గతంతో పోల్చుకుంటే బందరం నగరం విస్తరించడంతోపాటు జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది.
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
రాష్ట్రంలోనే అతిపెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గాల్లో మచిలీపట్నం ముందు వరుసలో ఉంటుంది. గతంతో పోల్చుకుంటే బందరం నగరం విస్తరించడంతోపాటు జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని బుధవారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ అర్బన్ పరిధిలో ఉంటుంది.
బందరు 1866లోనే పురపాలక సంఘంగా ఏర్పడింది. బందరు పట్టణం, కంటోన్మెంట్ ప్రాంతం, సర్కారుతోట, మాచవరం, చిలకలపూడితో కలిపి మొత్తం 19.46 చదరపు మైళ్ల వైశాల్యంతో మున్సిపాలిటీగా రూపొందింది. అనంతరం 1925 ప్రాంతంలో ‘ఎ’ గ్రేడ్ పురపాలకసంఘంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 50 డివిజన్లతో నగరపాలకసంస్థగా కొనసాగుతోంది. 2011 జనగణన లెక్కల ప్రకారం బందరు నగరంలో 1.80లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం 2లక్షలు దాటిపోయింది. బందరు మండలం కూడా 34 పంచాయతీలతో పెద్ద మండలంగా గుర్తింపు పొందింది. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు మండలాలుగా మార్చాలని గతంలో అధికారులు ప్రతిపాదనలు చేశారు.
గతంలో ప్రతిపాదనలు ఇలా..
బందరు నగరంలోని కోనేరు సెంటరు నుంచి రాజుపేట, ఇనుగుదురుపేట, చింతగుంటపాలెం, శివగంగ ప్రాంతాలతోపాటు చిన్నాపురం, రుద్రవర, పోలాటితిప్ప, కోన, భోగిరెడ్డిపల్లి, గుండుపాలెం ఇలా అటువైపు ఉన్న ప్రాంతాలను ఉత్తర మండలంగా మంగినపూడిబీచ్వైపు ఉన్న గ్రామాలతోపాటు, నగరంలోని డివిజన్లను దక్షిణ మండలంగా విభజించాలని కోరుతూ గతంలో ప్రతిపాదించారు. మచిలీపట్నాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసే క్రమంలో మండలంలో ఉన్న 34 పంచాయతీల్లో సుల్తానగరం, అరిశేపల్లి, పోతేపల్లి, చినకరగ్రహారం, పెదకరగ్రహారం, మేకావానిపాలెం. గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్ఎన్గొల్లపాలెం ఈ తొమ్మిది గ్రామాలను గతంలో నగరపాలకసంస్థలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత ఆ ప్రక్రియ వివిధ కారణాలతో ఆగిపోయింది. కొత్తగా మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లా కేంద్రాన్ని రెండు మండలాలుగా విభజించేందుకు విధివిధానాలు అందాల్సి ఉందని అధికారులు తెలిపారు.
నగర జనాభా: 1.80 లక్షలు
మండల జనాభా: 69,070
పురుషులు: 35,226
మహిళలు: 33,844
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక