మనుబోలు-నెల్లూరు మార్గం విద్యుదీకరణ పూర్తి
మూడో లైను పనుల్లో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని మనుబోలు-నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య 29.3 కిమీ విద్యుదీకరణ పూర్తయి సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
అందుబాటులోకి వచ్చిన కొత్త రైల్వే లైన్
రైల్వేస్టేసన్ (విజయవాడ), న్యూస్టుడే : మూడో లైను పనుల్లో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని మనుబోలు-నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య 29.3 కిమీ విద్యుదీకరణ పూర్తయి సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ విద్యుదీకరణతో పాటు డబ్లింగ్, ట్రిప్లింగ్కు ప్రాధాన్యం ఇస్తూ ఈ పనులు చేపట్టింది. తీర ప్రాంతం వెంబడి గ్రాండ్ ట్రంక్ మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఇది దోహదపడనుంది. ప్రయాణికులు, సరకు రవాణా రైళ్లు పెరగడంతో కీలకమైన ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ఈ సెక్షన్లో రద్దీని తగ్గించేందుకు విజయవాడ-గూడూరు మూడో లైను ప్రాజెక్టులో భాగంగా 2015-16 సంవత్సరంలో 288కిమీ దూరానికి రూ.3246 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సెక్షన్ల మధ్య ఉత్తర, తూర్పు ప్రాంతాలను దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్వీఎన్ఎల్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా అన్ని పనులను ఏకకాలంలో చేపట్టారు. ఇప్పటి వరకు ఉలవపాడు-కావలి మధ్య 29 కిమీ దూరం, తలమంచి-బిట్రగుంట-శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య 24.8కిమీ, కావలి-శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య రూ.12.2కిమీ, తలమంచి-నెల్లూరు మధ్య 17కిమీ, కరవడి-చినగంజాం మధ్య 23.5 కిమీ మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనుబోలు-నెల్లూరు మధ్య 29.3కిమీ పనులు పూర్తి చేయడంతో విజయవాడ,గూడూరు సెక్షన్లో మొత్తం 135.8కిమీ పూర్తయి ప్రాంభించడం జరిగింది. ఈ మార్గంలో పనులను నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేసిన ఆర్వీఎన్ఎల్, విజయవాడ డివిజన్ అధికారులను రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ అభినందించారు. విజయవాడ-గూడూరు మూడో లైనును అత్యధిక ప్రాధాన్యతతో చేపడుతున్నామని అన్ని సెక్షన్లలో పనులు ఏకకాలంలో వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడో లైను ప్రాజెక్టులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని విభాగాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు