చెత్త పన్ను కట్టొద్దు : బొండా
వైకాపా ప్రభుత్వం విధించే చెత్త పన్నును కట్టవద్దని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ప్రజలకు పిలుపునిచ్చారు.
గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న ఉమామహేశ్వరరావు, సాంబశివరావు, సాయిరామ్ గౌడ్ తదితరులు
మొగల్రాజపురం (చుట్టుగుంట): వైకాపా ప్రభుత్వం విధించే చెత్త పన్నును కట్టవద్దని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. చెత్తపన్నుపై ఆదివారం ధర్నాచౌక్లో మహా ధర్నా చేస్తున్నామని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావుతో కలిసి ఆవిష్కరించారు. ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. గత ఏడాది అగస్టులో విడుదల చేయాల్సిన ఆసరా.. ఈ ఏడాది మార్చిలో ఇచ్చారని విమర్శించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానుండడంతో.. నాలుగో విడత ఇచ్చేదెప్పుడని ప్రశ్నించారు. మహిళలకు ఆసరా అని టోకరా వేశారని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రూపుకు రూ.7.5లక్షలు రద్దు చేస్తానని హామీ ఇచ్చి, మడిమ తిప్పారని పేర్కొన్నారు. ప్రజలపై రూ.50వేల కోట్ల విద్యుత్తు భారం మోపుతున్నారని, విద్యుత్తు సర్ ఛార్జీల పేరుతో రూ.3వేల కోట్లు వసూలుకు ఏపీఆర్సీ రాష్ట్రంలోని నాలుగు డిస్కమ్లకు అనుమతించిందన్నారు. ఇంటి, నీటి, మరుగుదొడ్డి, చెత్త పన్నులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్నును రద్దు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారని గుర్తు చేశారు. చెత్తపన్ను కట్టవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నామని, ఎవరైనా కట్టమని ఒత్తిడి చేస్తే తెదేపా నాయకుల దృష్టికి తీసుకువస్తే ప్రజలకు అండగా ఉంటామని ఉమా పేర్కొన్నారు. పలు కార్పొరేషన్లపై తెచ్చిన రూ.1,18,000కోట్ల అప్పులను బడ్జెట్లో దాచాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అన్నీ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, దీనిపై ‘కాగ్’ నిలదీచిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. లుక్కా సాయిరామ్గౌడ్, ఘంటా కృష్ణమోహన్, చిన్న, శ్రీరామ్ ప్రసాద్, వెంకీ, పార్థునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి