logo

యువతను నిర్వీర్యం చేస్తున్న వైకాపా ప్రభుత్వం : బుద్ధప్రసాద్‌

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆరోపించారు.

Published : 28 Mar 2023 04:45 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగు, వినియోగానికి వైకాపా నాయకులు ప్రోత్సహిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఊరూరా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. తిరుపతిలో కూడా గంజాయి లభిస్తుందంటే ప్రభుత్వ అండ లేకుండా సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గంజాయి లభిస్తుండడం విచారకరమన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు