నేతల సిఫార్సుతోనే స్వాహా
ముందస్తు ప్రణాళిక ప్రకారం బీమా చేయించారు.. పక్కా పథకం ప్రకారం పరిహారం స్వాహా చేశారు. దీనికి తోడు అధికార పార్టీ నేతల సిఫార్సులు వినియోగించారు.
నిబంధనలకు బ్యాంకు తిలోదకాలు
పంచాయితీకి రావాలని ఒత్తిళ్లు
న్యూస్టుడే, పటమట, విజయవాడ సిటీ
ముందస్తు ప్రణాళిక ప్రకారం బీమా చేయించారు.. పక్కా పథకం ప్రకారం పరిహారం స్వాహా చేశారు. దీనికి తోడు అధికార పార్టీ నేతల సిఫార్సులు వినియోగించారు. బ్యాంకు మేనేజరుపై ఒత్తిడి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకున్నారు. ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘బీమా సొమ్ము.. స్నేహితులే కాజేశారు..!’ అనే శీర్షికన అర్హులకు అందాల్సిన పరిహారం సొమ్మును ఇతర వ్యక్తులు కాజేసిన విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బీమా సొమ్ము స్వాహాలో పాత్రధారులు ఏజెంటు.. ఇతర వ్యక్తులు కాగా.. సూత్రధారులు మాత్రం అధికార పార్టీ నేతలేనని తెలిసింది. వారి అండదండలతో బ్యాంకు నుంచి సొమ్ము మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వీయ సంతకం చేసిన చెక్ (సెల్ఫ్ చెక్కు)పై రూ.20 లక్షల నగదు ఒకేసారి డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఫోర్జరీ సంతకాలతో పాటు.. బ్యాంకు మేనేజరు పాత్రపైనా విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
పక్కా ప్రణాళికతోనే..
పక్కా ప్రణాళికతోనే బీమా ఏజెంట్ స్కెచ్ వేసి పరిహారం సొమ్ముకు ఎసరు పెట్టారు. విజయవాడ నగరానికి చెందిన పుప్పాల చిరంజీవికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంది. ఇది తెలిసిన ఓ ఏజెంటు.. చిరంజీవితో ఒక ప్రైవేటు బీమా కంపెనీలో 2022 జూన్లో జీవిత బీమా రూ.50లక్షలకు చేయించారు. 2022 అక్టోబరులో చిరంజీవి చనిపోయారు. వైద్య పరీక్షలు ఇతరత్రా అన్నీ మేనేజ్ చేసినట్లు తెలిసింది. మరణానంతరం బీమా పరిహారం రూ.50లక్షలు మంజూరైంది. నామినీగా ఉన్న చిరంజీవి తల్లి వెంకటగౌరికి మంజూరైంది. ఏజెంటు మహేష్ రంగంలోకి దిగి వెంకటగౌరికి బ్యాంకు ఖాతా యూనియన్ బ్యాంకులో ఉన్నప్పటికీ దాన్ని కాదని.. జిల్లా సహకార బ్యాంకు గవర్నర్పేట బ్రాంచ్లో ఖాతా తెరిపించారు. బీమా పరిహారం ఆ ఖాతాలో పడే విధంగా చేశారు. అక్కడ మేనేజర్తో సన్నిహిత సంబంధాలు ఉన్న మహేష్.. చిరంజీవి తల్లి గౌరిని ఏమార్చి చెక్లను సమర్పించి 2022 డిసెంబరు 28న రూ.20లక్షల నగదు ఖాతా నుంచి తీసుకున్నారు. తర్వాత మరో రూ.30లక్షలు మరో ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. గౌరి కూతురు నందినికి అనుమానం వచ్చి బీమా సొమ్ము రాలేదని ఆరా తీయగా బ్యాంకులో సొమ్ము లేదని తెలిసింది. ఈ పరిహారం స్వాహాలో పలు అక్రమాలు జరిగాయి. నిబంధనల ప్రకారం సెల్ఫ్ చెక్పై రూ.20లక్షల నగదు ఇవ్వరు. కానీ తెలిసిన వ్యక్తులే అంటూ బ్యాంకు మేనేజరు రాంబాబు సెలవివ్వడంతో సిబ్బంది ఇచ్చారని తెలిసింది. ఏజెంటుకు, నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధికార పార్టీ నేత ఒకరు, ఓ ప్రజాప్రతినిధి, మరో నేత బ్యాంకు మేనేజరుకు సిఫార్సు చేయడంతోనే నగదు ఇచ్చినట్లు తెలిసింది. అంతకుముందు ఏజెంటు, మేనేజరు కలిసి పలువురు ఖాతాదారుల నుంచి బలవంతంగా బీమా చేయించినట్లు తెలిసింది. ఆ సంబంధాలతో సొమ్ము ఇచ్చినట్లు సమాచారం. దీనిపై గత నెల స్పందనలో బాధితురాలు గౌరి ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు. ఏసీపీకి మరోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు అధికార పార్టీ పెద్దలు ఆమెను పంచాయితీకి పిలిచినట్లు తెలిసింది. విషయం వెలుగుచూసిన తర్వాత ఏజెంటు ఆమెకు జవవరి 1న రూ.10 లక్షలు నగదు ఒకసారి, మరో రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాకు జనవరి 9న బదిలీ చేశారు. మిగిలిన రూ.20 లక్షలు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
ఇలాంటివి ఎన్నో..
సంబంధం లేని వ్యక్తికి రూ.20లక్షల నగదు ఇవ్వడం సాధారణ విషయం కాదని పోలీసులు సైతం బ్యాంకు మేనేజర్ పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ బీమా చేయించిన తీరుపై ఆ ప్రైవేటు సంస్థ ఆరా తీస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు, నయం కాని జబ్బులు ఉన్న వారికి బీమా తిరస్కరిస్తారు. కానీ ఏజెంటు చేసిన పాలసీలపై తిరిగి విచారణ చేయించేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
మేనేజరును రక్షించేందుకే..
అసలు ఖాతాదారు బ్యాంకుకు రాకుండానే ఖాతా తెరవడమే కాకుండా ఆమె చరవాణి నెంబరు కాకుండో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చరవాణి అనుసంధానం చేసి సందేశాలు రాకుండా పక్కా ప్రణాళికతో చేయడంలో బ్యాంకు మేనేజరు పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయనను కాపాడేందుకు కొందరు నేతలు పోలీసు దర్యాప్తునకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు కాకుండా దాదాపు నెల రోజులు వాయిదా వేయించిన నేతలు.. ఇప్పుడు పంచాయితీ పేరుతో సెటిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక