గణాంకాల్లో ఘనం.. ఆచరణల్లో దూరం
సాగుదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళిక అమలు చేస్తోంది.
రుణ ప్రణాళికలో కౌలు రైతులకు అన్యాయం
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే : సాగుదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళిక అమలు చేస్తోంది. సాగు చేస్తున్న వారికే ఇవ్వాల్సిన రుణాలు గణాంకాల పరంగా ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పంట రుణాలు వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదారులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం పదిశాతం కూడా దక్కే పరిస్థితి లేదు.ఖరీఫ్, రబీ సీజన్కు ప్రతిపాదించిన రుణ ప్రణాళికలో వీరికి సంబంధించి ఎటువంటి కేటాయింపు లక్ష్యాలు లేకపోవడం విమర్శకు తావిస్తోంది.
జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటాయి. ఇందులో రమారమి ఎనభైశాతం మేర కౌలురైతులే సాగు చేస్తుంటారు. కౌలుదారులు సాగు కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవడం పరిపాటిగా ఉంటోంది. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, వాతావరణ అననుకూల పరిస్థితులు వంటి కారణాలతో తరచూ రైతులు ఆర్థికంగా నష్టపోక తప్పడం లేదు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెపుతున్నా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అధికవడ్డీల అప్పుల ఊబిలో పడిపోతున్నామంటూ ఆక్రోశిస్తున్నారు. మరో పక్క ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు వచ్చే పరిహారం వంటి ప్రయోజనాలు పలు ప్రాంతాల్లో భూ యజమానులే దక్కించుకుంటున్నారు. పెరిగిపోతున్న సాగు వ్యయానికి అనుగుణంగా పెట్టుబడి కోసం అవస్థలు పడలేక గత ఏడాది చాలా గ్రామాల్లో కౌలుకు తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇదే పరిస్థితి మరో రెండు మూడు సంవత్సరాలు కొనసాగితే దూర ప్రాంతాల్లో ఉండే భూయజమానులు సాగు చేయలేక కౌలుదారులు ముందుకు రాక క్రాప్హాలిడే పాటించే దుస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఎవరికిస్తున్నారో స్పష్టత లేదు..
వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలు, వ్యవసాయ సంబంధిత టర్మ్, ఆక్వా రుణాలు ప్రతిపాదిస్తారు. ఇందులో కౌలురైతులకు ఉపయోగపడేవి కేవలం పంట రుణాలు మాత్రమే. ప్రతి ఏడాది ఎన్ని కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు... అందులో కౌలు రైతులకు ఎంత మందికి ప్రయోజనం కల్పించారన్న విషయంపై వాస్తవిక స్పష్టత ఉండటం లేదు. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో కౌలురైతులకు రూ.1000 కోట్లు రుణ లక్ష్యంగా ఉండగా దాదాపు రూ.300 కోట్లు ఇచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 80 శాతానికి పైగా కౌలుదారులే సాగు చేస్తుండగా మిగిలిన రూ.700 కోట్లు ఎవరికి పెట్టుబడి రుణంగా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. సాగు రుణాల్లో అత్యధిశాతం మేర సాగు చేయకున్నా భూయజమానులే దక్కించుకుంటూ కౌలుదారుల ప్రయోజనాలు హరించివేస్తున్నారు.
సీసీఆర్సీ కార్డులు ఎంత మందికో?
వరి పంటకు ఎకరానికి రూ.41 వేలు రుణలక్ష్యం(స్కేల్ఆఫ్ ఫైనాన్స్గా)గా నిర్ధారించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి అదనంగా ఒక శాతం రుణాలు ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నా కౌలుదారులకు దక్కింది నామమాత్రమే. మొత్తం 50,000 మందికి పైగా సీసీఆర్సీ కార్డులు ఇచ్చినా రుణ రూపేణా ఇచ్చింది కేవలం రూ.40.37 కోట్లు మాత్రమే. వార్షిక రుణ ప్రణాళికలో 10 శాతం కౌలుదారులకు ఇచ్చే కేటాయింపును గడచిన మూడు సంవత్సరాలుగా చూపడం లేదు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది కౌలురైతులున్నారు. 2023-24 సంవత్సరానికి 52,570 మందికి పంట హక్కు ధ్రువీకరణ(సీసీఆర్సీ) పత్రాలు ఇవ్వాలన్న లక్ష్యం నిర్ణయించారు. ఈ ఏడాది రూ.3,605 కోట్లు పంట రుణ లక్ష్యంగా నిర్ధారించినా కౌలు రైతులకు రుణాల కేటాయింపుపై ఎటువంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎంతమందికి సీసీఆర్సీ కార్డులు ఇస్తారు.. వారిలో ఎంత మంది రుణసౌలభ్యం దక్కుతుందో తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం