‘బ్రిజ్భూషణ్ను బర్తరఫ్ చేయాలి’
భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలని, ఎంపీ సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
విజయవాడ(అలంకార్కూడలి), న్యూస్టుడే : భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలని, ఎంపీ సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, అప్పటి మంత్రి, డబ్ల్యూఎఫ్ఐ కోచ్ల వేధింపులపై మహిళా రెజ్లర్ల చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించాల్సిన భాజపా.. పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి, దేశానికి ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లకు భాజపా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వేధింపుల ఘటనపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్.బాబూరావు మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు నిరసన తెలుపుతామంటే.. పోలీసులు అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుమాలినవని పేర్కొన్నారు. ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ... దేశానికి కీర్తి తెచ్చిన మహిళా రెజ్లర్లకు కేంద్రం అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై దాడులు చేసే అంశంలో వేగంగా స్పందించే భాజపా.. రెజ్లర్ల విషయంలో ఒక్క శాతమైనా శ్రద్ధచూపితే వారికి న్యాయం జరిగేదని పేర్కొన్నారు. వివిధ మహిళా సంఘాలు, యువత, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నుంచి సంతకాల సేకరణ చేసి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని నేతలు పేర్కొన్నారు. అనంతరం బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని రాష్ట్రపతిని కోరుతూ నాయకులు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వి.ఉమామహేశ్వరరావు, అక్కినేని వనజ, కె.వి.వి.ప్రసాద్, రావులపల్లి రవీంద్రనాథ్, కేశవరావు, కొలనుకొండ శివాజీ, సుందరరామరాజు, డి.రమాదేవి, పి.దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.