Machilipatnam: డాక్టర్ రాధ హత్య కేసు: అతడేనని తెలుసు... అయినా తాత్సారం!
మచిలీపట్నం నగరంలో సంచలనం రేపిన వైద్యురాలు మాచర్ల రాధ హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చింది.
వైద్యురాలు రాధ
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: మచిలీపట్నం నగరంలో సంచలనం రేపిన వైద్యురాలు మాచర్ల రాధ హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చింది. అయితే... హంతకులు ఎవరనే విషయంలో బలమైన ఆధారాలు లభ్యమైనా రెండు వారాలుగా దర్యాప్తు కొనసాగుతూనే ఉండడం చర్చనీయాంశం అవుతోంది. కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వైద్యురాలి భర్తను కాపాడేందుకు ఒక బలమైన వర్గం చేస్తున్న లాబీయింగ్ను బట్టి పథకం ప్రకారమే ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
ప్రాణాలు బలిగొన్న ఆర్థిక అంశాలు: మిస్టరీగా మారిన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే... మాచర్ల రాధ, ఆమె భర్త ఉమామహేశ్వరరావు పిల్లల వైద్యనిపుణులుగా పేరొందారు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ఉమామహేశ్వరరావు తన ప్రాక్టీస్ ద్వారా బాగానే ఆస్తులు సంపాదించారు. రాధ కుటుంబం స్వతహాగా మంచి స్థితిపరులు. కొద్దికాలం కిందట పుట్టింటి నుంచి పెద్ద మొత్తంలో నగదు ఆమెకు సంక్రమించినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత సంపాదనకు తోడు పుట్టింటి నుంచి సంక్రమించిన రూ. కోట్ల ఆస్తిని ధార్మిక, సేవా కార్యక్రమాలకు ఇచ్చేయాలనే నిర్ణయమే ఆమె ప్రాణాలు బలిగొందనే చర్చసాగుతోంది. కుటుంబపరంగా, వ్యక్తిగతంగా ఎవరితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోయినా, కొన్ని నెలలుగా ప్రాక్టీసు వదిలేసి ఇంటికే పరిమితమైన రాధ దారుణంగా హత్యకావడం వెనుక ఆర్థిక అంశాలు మినహా ఇతర కారణాలు లేవని ఆమె బంధువర్గం స్పష్టం చేసింది. హత్యానంతరం తన భార్య ఒంటిపై నగలు అపహరించారని ఉమామహేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
కీలక ఆధారాలు లభ్యం...కేసు దర్యాప్తులో భాగంగా ఉమామహేశ్వరరావు, ఆయనకు నమ్మినబంటుగా ఉండే కారు డ్రైవర్, ఆస్పత్రి సిబ్బంది, ఇతర అనుమానితులను విచారించారు. డ్రైవర్ కారం కొనుగోలు చేసిన సూపర్ మార్కెట్లో సీసీ కెమెరాల్లోని దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కొన్న కారాన్ని సంఘటనా స్థలంలో చల్లినట్లు గుర్తించారు. పోలీసు జాగిలాలను తప్పుదారి పట్టించేందుకు ఇలా చేసినట్లు తేలింది. హత్యచేసి దోచుకుపోయారని చెబుతున్న నగలు అతని వద్ద స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
బలమైన లాబీయింగ్.. కేసు దర్యాప్తునకు వేసిన ప్రత్యేక అధికారులు హత్యతో ప్రమేయమున్న వారిని రెండు రోజుల వ్యవధిలోనే గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. దర్యాప్తులో భాగంగా ఉమామహేశ్వరరావు ఇంటరాగేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర వైద్యులతో అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ల్యాబ్ నిర్వాహకుడు, ఉమామహేశ్వరరావుతో స్నేహంగా ఉండే రియల్ వ్యాపారులు బలమైన లాబీయింగ్తో రంగంలోకి దిగారు. హత్య జరిగిన మరుసటి రోజే కేసును పక్కదారి పట్టించేలా నగరంలో చెడ్డీగ్యాంగ్ అని సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయించడం వెనుక వీరి హస్తం ఉందన్న ప్రచారం ఉంది. ఉమామహేశ్వరరావుపై శారీరక, మానసిక ఒత్తిడి లేకుండా చేయడానికి ఇప్పటికే రూ. కోటికి పైగా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. దర్యాప్తు సమయంలో ఆస్పత్రిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కారు డ్రైవర్ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా మూడు రకాలుగా ఇచ్చిన స్టేట్మెంట్ల వెనుక వారి హస్తం ఉన్నట్టుగా సమాచారం. లభ్యమైన ఆధారాలతో కేసుకు ముగింపు పలకడంలో జరుగుతున్న జాప్యం వెనుక ఏదైనా లాబీయింగ్ పనిచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు నెలల ముందే ప్రణాళిక... డాక్టర్ రాధ హత్య కేసులో ఉమామహేశ్వరరావు నిందితుడని పోలీసుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. హత్యకు మూడు నెలల కిందటే స్కెచ్ వేసి.. దీనికి డ్రైవర్తో ప్రణాళికను పంచుకున్నట్లు తెలిసింది. భారీగా సొమ్ము ఇస్తానని ఆశ చూపినట్లు సమాచారం. అవకాశం కోసం ఎదురుచూసి, కుమారుడు ఇంట్లో లేని సమయంలో పథకాన్ని అమలు చేశారు. రాధ తలపై ఇనుప వస్తువుతో మోదినట్లు తేలింది. పెనుగులాటలో ఆమె చేతిలో ఉమామహేశ్వరరావు తల వెంట్రుకలు చిక్కుకుపోయాయి. వీటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా అతడివే అని నిర్ధారణ అయింది. ఇప్పటికే నిందితులు వాడిన వస్తువులు, ఆమె ఒంటిపై ఆభరణాలు పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. తొలుత ఉమామహేశ్వరరావు, డ్రైవర్.. నోరు విప్పలేదు. గట్టిగా ప్రశ్నించే సరికి ఇంటరాగేషన్లో అన్నీ వెల్లడించినట్లు తెలిసింది. విచారణ పూర్తయ్యాక.. నేడో, రేపో ప్రెస్మీట్ పెట్టి నిందితుల అరెస్టు చూపే వీలుంది.
వెలుగుచూసిన మనస్పర్థలు
సంఘటనా స్థలంలో ప్రాథమికంగా లభించిన ఆధారాలు ఇంట్లో వ్యక్తులనే అనుమానించేలా ఉన్నాయి. వైద్యురాలిని ఆమెకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు, ఆస్పత్రితో సంబంధం ఉన్న వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు హత్య చేసేందుకు అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాప్రదేశంలో సేకరించిన ఆధారాల మేరకు కూడా అపరిచిత వ్యక్తుల ఆనవాళ్లు కన్పించలేదు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉండాల్సిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయకపోవడం కూడా పథకంలో భాగమే అనే అనుమానాలకు తావిచ్చింది. హత్య జరిగిన రోజు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలో అనుమానిత వ్యక్తుల కదలికలు కన్పించలేదు. కొన్నేళ్ల కిందట ఆర్థికపరంగా తన భార్య రాధ వేధింపులకు గురిచేస్తోందని ఉమామహేశ్వరరావు ఆమెపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి చూస్తే భార్యాభర్తల నడుమ ఆర్థికపరమైన అంశాల వల్ల భేదాభిప్రాయాలున్నట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
[ 30-04-2024]
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. -
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత