logo

అయిదుగురు బుక్‌ కీపర్లపై వేటు

కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్‌(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్‌ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Published : 28 Mar 2024 05:42 IST

పెడన, న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్‌(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్‌ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముత్యాల విజయకుమారి(కొమాళ్లపూడి), బత్తుల గీతాంజలి(యండపల్లి), మేకల రామలక్ష్మి(చినగొల్లపాలెం), బొలిశెట్టి శివకుమారి, పుప్పాల తరంగిణి(నీలిపూడి)లు సస్పెండైన వారిలో ఉన్నారు. వీరు ఎన్నికల కోడ్‌ అతిక్రమించినట్లు ప్రాథమికంగా సమాచారం అందుకున్న రిటర్నింగ్‌ అధికారి పీవీ రమణ కృత్తివెన్ను ఎంపీడీవోను విచారణకు ఆదేశించారు. ఆరోపణలు నిరూపితం కావడంతో ఈ అయిదుగుర్ని తొలగిస్తూ కృత్తివెన్ను మండల సమైక్య అధ్యక్షురాలు జి.అరుణ కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపా ప్రచారంలో పాల్గొని బుక్‌ కీపర్లపూ వేటు పడడం జిల్లాలో తొలిగా పెడనలో వెలుగు చూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని